ఈరోజు ముచ్చటలన్నీ మన తెలుగు భాషాభిమానం గురించే . చెప్పుకోడానికి అనేక సంగతులు ఉన్నాయి .ఎందరో మాతృభాష గొప్పదనం గురించి ఎప్పుడో ,ఎందరో మరెన్నో సార్లు చెప్పారు .మన మూ వింటున్నాం కానీ పాటించడంలో ఇష్టం , ఓపిక ,ఆసక్తి అనే విలేక అనే సంగతి తెలిసినా , చెప్పడం అలవాటైన వారు ఊరుకోరుగా . నేను ఆ బాపతే అనుకోండి .
ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ?అనేది చిక్కు ప్రశ్న . అయినా చీకట్లో బాణం వేస్తున్న .ఏ కొందరికైనా తగలకపోతుందా అనే అత్యాశతో మొదలెట్టా . ఇందులో స్పృశించిన అంశాలలో ఒక క్రమం గురించి వెతకకండి . కోతి కొమ్మచ్చి అనుకోండి తప్పులేదు .బహుశా అదే సరైన మాటేమో కూడా .
భాష అనేది అతి చిన్న మాట . రెండు అక్షరాల మాట కానీ ,ఆ రెండక్షరాలలో మర్రి విత్తనంలా విశ్వమం తా దాగింది .నేల నాలుగు చెరుగు ల పా కిం ది .ఆకాశపుటంచులను తాకింది ఎందుకంటే భావవ్యక్తీకరణకు పునాది భాష కదా .
ప్రతి మనిషికి తల్లి ఎలా అత్యంత సన్నిహితమో ఆమె ఒడి అనే బడిలో నేర్చిన పలుకూ అంత సన్నిహితం . అయితే ఆధునిక కాలంలో అమ్మను , అమ్మ భాషను ఒద్దు అనుకుంటున్నాం .అసలు గలగల మాట్లాడమంటే ఒక సు హృద్భావ వాతావరణ అని సృష్టించడమే . ఆ వాతావరణంలో అవసరానికి మించి , ఆడంబరాన్ని జోడించి ,ఇతర భాషా పదాలను వాడడం నల్లేరుపై బండి నడకంత సులభం .ఆ వ్యామోహం నుంచి బయటికి రావడానికి మనకు సుతరామూ ఇష్టం లేదు .
ఎప్పటిది తెలుగు అంటే ,మన ఊహకందనంత పాతది .క్రీస్తు శకం 575లో కడప జిల్లా ఎర్రగుడిపాడు లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ధనం జయుడు తొలి తెలుగు శాసనం వేయించాడు .
ఎంత చక్కని భాష అండి మన తెలుగు .గుండ్రంగా ముత్యాల లాంటి అక్షరాలతో ముచ్చటైనది మన లిపి . కొన్ని సరదా సంగతులు గుర్తు చేస్తాను .విసుక్కోక చదవండి .చదివించండి . ఆపై ఆలోచించండి .
ఆ అనే ఏకాక్షర పదం లేదా వాక్యం ఉంది . దీన్ని ఆశ్చర్యంగా ,ప్రశ్నగా ,జవాబుగా ,నీరసంగా , అనుమానంగా ఇంకా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు .
మొన్ననే ఓ మంచి వాక్యం చదివాను .మీరూ చదవండి మరి . సులువైనది . బరువైనది . గుర్తుపెట్టుకో తగ్గది కూడా. సముద్రమంత లోతైన అర్థమున్న వాక్యం ఇది. భూమ్మీదికి అరువు పై వచ్చాము , కొంత కాలానికి భూమికి బరువై వెళ్ళిపోతాం. ఈ మధ్యలో పరువుగా బ్రతకాలి .
చూడండి . అరువు -బరువు- పరువు ఒక అక్షరం తేడాతో ఎంత సొగసైన వాక్యం సిద్ధమైంది .
మరో చిన్న మాట .
రెండెడ్ల బండ్లు అంటే ,రెండు అర్థాలు
రెండు ఎడ్లు గల బండ్లు
ఎడ్ల బండ్లు రెండు .
ఎంత అందం ఉంది ఈ భాషలో .ఇంకోటి ఇది రెండు పదాల ప్రశ్నా ర్ధక వాక్యం .
వాడొచ్చాడా ? నేను వివరించక్కర్లేదు .
మీరు పలికే విధాన్ని బట్టి అర్థం మారుతుంది ప్రయత్నించి , చూడండి.
ఇంకో సరదా వాక్యం .
నీ నూనె నా నూనె ని నేనన్నానా, నీ నూనె నీ నూనె .నా నూనె నా నూనె .
నిదానంగా చదవండి ఒకే అక్షరంతో మూడు వాక్యాలు వచ్చాయి .
ఒకే పదాన్ని సందర్భం బట్టి రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు . బొక్కలో వేస్తాను .నాకు లక్ష బొక్క వచ్చింది వ్యాపారంలో. బొక్కలు కొట్టే మిషన్ ఉందా ?మొదటి బొక్కకు జైలు , రెండవ బొక్క నష్టం ,మూడో మొక్కకు పంచింగ్ మిషన్ అని అర్ధాలు వచ్చాయి .
పులిహోర మనకు ఇష్టమైన వంటకం .ఇందులో పులి ఎక్కడుంది అని గాబరా పడకండి . ఇక్కడ పులి అంటే పుల్లని పులిసినఓ గిరం అంటే ఆహారం .పులిబొంగరాలు అనే మాట గుర్తుకు తెచ్చుకోండి .
వల్ల కాడు పూర్వరూపం ఒ ల్ల కాటు పనికిరాని అడవి . అదే పొల్లకాడై వల్లకాడుగా స్థిరపడింది .భీమా అనే పదం తీసుకోండి ఇందులోని బీమా అనేది పారసీ పదం .ఆ భాషలోభీమా అంటే భయం .జీవితంలో భయాన్ని పోగొట్టే సంస్థ భీమా సంస్థ .
తద్దినంకు చావుకు సంబంధం లేదు .దాన్ని విడదీస్తే త త్ + దినం ఆ రోజు అని అసలు అర్థం .
మనం పాకీ పనిని అసహ్యించుకుంటాం . పవిత్రత ,శుభ్రత అని అర్ధం దా నికి .పాకిస్తాన్ అంటే పవిత్రమైన దేశం అని అర్థం .
ఒకే పదం రకరకాలుగా వాడుతూ విభిన్నమైన అర్థాలను సాధిస్తాం .నమ్మట్లేదా ? కింది ఉదాహరణ చూడండి
ఆకు _లోలాకు -విస్తరాకు_ విడాకులు . ఇతర భాషా పదాలతోను వేరు వేరు అర్థాలను సాధిస్తున్నాం .
ఇది సెకండ్ హ్యాండ్ పుస్తకం .తీరా సమయానికి వాడు హ్యాండ్ ఇచ్చాడు . రెండు హ్యాండ్లూ వేర్వేరు సుమా
తెలుగు జీవద్భాష వాడుకలో ఉంది .సరిగా వాడకుంటే నాచుపట్టే స్థితికి దగ్గరగా జరుగుతుంది. వాడక మనం చెడుతున్నాం . ప్రతి భాషలోనూ మార్పులు చేర్పులు సహజం .పాత అర్థాలు పక్కకు జరిగి ,కొత్త అర్ధాలను సంతరించుకుంటాయి మనకు తెలుగు వచ్చుఅంటే సరిపోదు .మన తర్వాతి తరాల సంగతి ?
మళ్ళీ తెలుగు మనదే అన్న నిజం అప్పుడప్పుడు గుర్తుకొచ్చి ,చమత్కారాలతో కూడా జవాబిస్తాం .
ఏమండీ సుబ్బారావు గారిల్లెక్కడా ?
ఆయనకేం పని ఇల్లెక్కడానికి .
అర్థం ఉన్నా లేకున్నా , కొన్ని పదాలు జంటగా వాడితేనే మనకు అర్థమవుతాయి .ఉదాహరణ
పిల్లా జెల్ల _ఇల్లుగి ల్లు_ నగానట్రా
ధ్వని అనుకరణ శబ్దాలున్నాయి .అది మరో ముచ్చట .
డ్డా మ్మని పడ్డాడు .పూలు జలజలా రాలే . పకపక నవ్వాడు .
పద బంధాలు _నానుడులు_ సామెతలు _పొడుపు కథలు -జాతీయాలు -కథలు -కవితలు- నవలలు _కావ్యాలు ఇంత కాలం నుండి అని చెప్పడానికి వీలుకాని రోజు నుంచి కాచిన పాలపై తేరి న మీగడ ఇదంతా . ఆస్వాదించండి . ఆనందించండి మరోమాట అడుగు
దేని గురించి అని అడగండి .అదే అడుగు గురించి . అంటే ప్రశ్నించు అని అర్థం .ఈ పదాన్ని ఎన్నో రకాలుగా వాడతాం. ప్రతి అడుగుకి అర్థం మారుతుంది .
అడుగు అంటే పాదం మూడు అడుగుల నే ల కావాలని వామనుడు బలిని అడిగాడుగా .
అడుగు తీసి అడుగు పెట్టలేనంత జనం వచ్చారు
ప్రయాణం అడుగు ఆమడగా సాగుతుందంటే చాలా కష్టంగా ఉంది అని అర్థం .
బాల్చీలో నీళ్లు అడుగంటాయి .
రేపు పొద్దున ఆయన అడిగితే ఏం చెప్పను ?
ఇవాళ వాడిని అడిగేయాలి .
నలుగురిని అడిగి చేయి .
ఒక్కొక్క పదం ఎన్నెన్ని వన్నెలతో మీ జీవితంలో చేరిపోయిందో మీ మనసునే అడగండి .
ఇవన్నీ మాకు తెలిసినవే . కొత్తదనం ఏమీ లేదు పాత చింతకాయ పచ్చడే గా అంటున్నారా .నిజమే .నాకూ తొలు త అలానే అనిపించింది .అయినా పాత చింతకాయ పచ్చడి పధ్యా నికి పనికొస్తుంది . కొత్త చింతకాయ జలుబు చేస్తుంది .సమస్యలకు పరిష్కారాలు తెలియక కాదు .పాటించడం ఇష్టం లేక , ఓపిక లేక. ఆలా వదిలేస్తే పీట ముడి పడిపోతాయి .
ఈమధ్య సురవరం ప్రతాపరెడ్డి గారి తెలంగాణ వ్యాసాలు అనే పుస్తకం చదివాను . అందులో తెలుగు భాషా సేవ అని ఆలోచనాత్మక వ్యాసం ఉంది .అది చదివాక ఇది రాయాలనిపించింది .
“దేశాభివృద్ధికి భాషాభివృద్ది ఒక గొప్ప సాధనమని అందరికీ తెలిసిన విషయమే . బెంగాలీ భాషతో సమానముగా మనదేశములో అభివృద్ధి చెందుచున్న రెండవ భాష మహారాష్ట్రము .మీకే దేశ చరిత్ర కావలసిన ను ఈ భాష యందు దొరకగలదు .ప్రకృతి శాస్త్రవుల అనేకములు వ్రాయించబడినవి ఇట్లు మన ఇరుగుపొరుగు వారు తమ తమ దేశ భాషలను అభివృద్ధి చేసుకొని ,అవిశ్రాంతముగా స్వార్ధమునందును దృష్టి ఉంచక , పాటుపడుచున్న మన తెలుగు సీమ వారు మాత్రము ఇతర అన్ని విషయములందువలె భాషాభివృద్ది విషయమునను గాఢ నిద్రపోవుచున్నారు .ఇది మిక్కిలి శోచనీయము .”
“విద్య రాని వాడు తోక కొమ్ములు లేని పసరమని మన పెద్దలన్నారు . మాతృభాషనేరుగ ని వాడు తెలివి లేని పసరమని చెప్పవలెను .మనకు ఇంగ్లీషు , హిందీ భాషలపై కలవ్యామూహము మన మాతృభాష పై లేదు . పరభాషలన్ని నేర్చిన కులవిద్యకు సాటి లేదు గువ్వలచెన్న అని ఆ మహానుభావుడు ఆనాడే ఉర్దూ హిందీ ఇంగ్లీష్ వెలువలు మనలను ముంచుకొని పోకముందే బోధించి ఉండెను.”
“మన ప్రాచీనాంధ్ర వీరుల గాధలను తెలుపు గ్రంథాలు మనము వ్రాయకున్నా , తందాన (జంగం) కథలు చెప్పు పిచ్చిగుంట వారిలో ఆ చరిత్ర లింక నిలిచి ఉన్నవి .అవి అంతరించక ముందే వాటిని సమకూర్చి ,ముద్రించ వలెను . సోమనాద్రి ,రామేశ్వరరావు ,సదాశివరెడ్డి , తిమ్మరాజు , కుంభం పుల్లారెడ్డి , మెదక్ శంకరమ్మ , కుంభం చెన్నయ్య , సర్వాయి పాపడు మొదలగు వారి కథలు కొల్లలుగా అనాధృతమై , ఆముద్రిత మై ,విస్తృత పధ మందు లీనమై పోవుచున్నవి .మనము మన జంగం కథలను సవరించి ,సంస్కరించి ,చారిత్రక పీఠికలతో ముద్రించి ,ప్రచారం చేయుట అవసరము .”
“మనకు ఏ విషయమైనా తెలుసుకొనే అవసరము కలిగితే , ఇంగ్లీషు వాంగ్మయాన్ని ఆశ్రయిస్తున్నాము . మన భాషలో వివిధ పరిశోధనలకును , విజ్ఞానానికి పనికి వచ్చు ఉద్ గ్రంథాలను వ్రాయించి ప్రచురింపవలెను .
“ఇంగ్లీషు వారికి తమ భాషపై కల అభిమానములో సహస్రాంశము కూడా మనకు లేదు . ప్రతి జాతికిని తన మాతృభాషపై అభిమానం ఉన్నట్లు సర్వత్ర వ్యక్తమైనది .అరబ్ తన భాష అమృతం అనియు తక్కిన భాషలంతా తన ఒంటె కాలి క్రింది దుమ్ముతో సమానమనియు అంటాడు . ఆర్యులు తమ భాష దేవ భాష అనేది తక్కినవి భాషలనా గ రికము లు ,తమదే నాగరిక భాష అన్నారు . ప్రాకృతము విజృంభించిన వాడు సంస్కృతాన్ని గురించి కూడా ఈ మాటలే అంటాడు .
మీ మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉన్నాయ ని నాకు తెలుసు . నేను అలాగే అనుకున్నాను .ఇంకా ఇంకా చాలా అనుకున్నాను . ఎందుకంటే ఈ మాటలు 80 సంవత్సరాల క్రితం చెప్పినవి .
ఈ మాటలు శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు గారు ఓరుగల్లు లో చేసిన అధ్యక్షపన్యాసం లోనివి .
( 28 -12-1944)
ఎలా ఈ సమస్యను పరిష్కరించడం ?
నాకు తోచిన కొన్ని సూచనలు .మీ స్వబుద్ధితో మరికొన్నింటిని జోడించి , ప్రయత్నించండి .మొదటగా మంచి పుస్తకాలు చదవండి .ప్రముఖుల ప్రవచనాలను వినండి . చాలామంది ప్రవచన కారులు ఆంగ్ల పదాలు వాడకుండా , గంటల తరబడి ,సులువైన సరళమైన భాషలో విషయాన్ని అందిస్తున్నారు . ఈనాడు పేపర్ చదవండి . అందులో నేను మొదట చదివేది సంపాదకీయాలు ,హెడ్డింగులు .
రోజు ఓ పది నిమిషాలు ఇంగ్లీషు పదాలు వాడకుండా మాట్లాడే ప్రయత్నం చేయించండి పిల్లలతో .పాత సినిమాలు చూడకున్నా పర్వాలేదు డైలాగులు వినండి .కొత్త పదాలు -పదబంధాలు- సామెతలు-నానుడులు -జాతీయాలు తెలుస్తాయి .మీ పనులను చేసుకుంటూనే ఈ పని చేయవచ్చు .
వివిధ పత్రికల్లో వచ్చే గళ్ళ నుడి కట్టు సరదాగా ప్రయత్నించండీ . చివరగా ప్రస్తుతం వస్తున్న యాంకర్ల (వ్యాఖ్యాతల) మాటలు వినండి .అయితే ఓ మాట . పై పనులన్నీ కొంతకాలం చేశాక , చివరిది ఆచరించండి .చూడకండి .మళ్లీ చెప్తున్నాను . వీళ్ళు గురువులే .ఎలా పలకవచ్చో , ఎక్కడ ఒత్తులు అవసరమో ,ఎక్కడ అనవసరమో ,తెలుసుకునే ప్రయత్నాలు చేయండి . .
కాటుక కంటినీరు చనుకట్టు పయిం బడనేల …. త్రి శుద్ధి గ నమ్ము భారతీ .తెలుగు సాహిత్యంలో
ఇది పోత నా మాత్యు ని ప్రసిద్ధ చాటువు .తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న ఆణిముత్యం . ఇందులో శారదా దే వి కవి కళ్ళముందర దీన వదనంతో ప్రత్యక్షమైంది . చలించి పోయాడు పోతన . తన జీవితా వసరాలకోసం అమ్మనమ్మనని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేశాడు .
మన కీనాడున్న సమస్యలు అలాంటివి కావు . ఆకలి వే ళలు లేవు . రాజ్యస్థానాల అదలింపులు , బెదరింపులు కనుచూపు మెరలో లేవు . రావు . ఐనా తెలుగు భాషకు ఈ దుస్థితి ఏల ?
ప్రభుత్వాన్ని నిందించి మన భాధ్యతను వదిలించుకుందామా ?
మనవైపు నుంచి నిశ్శబ్దం సబబేన ?
మన నరనరాల్లో ,అణువు అణువున జీర్ణించిన జాతి సంపదను చేతు లా రా జా రవిడుచుకుందామ ?
కొంతకాలానికి తరు వాతి తరా లు తెలుగు గొప్పదనాన్ని ఇ తర దేశీయుల ద్వారణో ,పర భాశీయుల ద్వారానో తెలుసుకుని మనల్ని క్ష మి స్తారా
మనమేం చేద్దాం
ఆలోచించండి .
తెలుగు భాష గొప్పదని మనం కొత్తగా చెప్పనక్కరలేదు .వెనకటి వారెందరో ఎప్పుడో చెప్పేశారు .ఆ భాష గొప్పదనాన్ని తెలుసుకోండి .తర్వాత తరాలకు దాని మీద ఆసక్తి కలిగేలా ప్రోత్సహించండి . ఇప్పటి తల్లిదండ్రులు మీకు ఆసక్తి కలిగితే ,తప్పనిసరిగా అది మీ పిల్లలలో ప్రతిఫలిస్తుంది . చదవడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే మన భాషా జ్ఞానం పెరుగుతుంది . వేగంగా చదవడం అలవాటు అవుతుంది .మన ఆలోచన పరిధి విస్తరిస్తుంది .
మన మనసులోని భావాలను ఇతరులకు అందించడానికి ఇతరులు చెప్పిందాన్ని గ్రహించడమే భాషకు పరమావధి . అది చేతగానప్పుడు తెలుగువారు అని చెప్పుకోవడం సమంజసమేనా ?నాకు జవాబు అవసరం లేదు మీ మనసును మీరే ప్రశ్నించండి .సమాధానం మీకే తెలుస్తుంది .