శ్వేత ప్రపంచం

మానవ జీవితంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్క నిమిషం రంగులు లేని ప్రపంచాన్ని ఊహించుకోండి  .మన వల్ల కాదు . ప్రకృతిలో ఎన్నో వర్ణాలు ఉన్నాయి  .అవన్నీ  మన వ్యక్తిత్వంపైమనకు  తెలియకుండానే చెరగని ముద్ర వేస్తాయి . వేసాయి  .వేస్తున్నాయి . మానవ ప్రవర్తన  పై రంగుల ప్రభావాలను గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి .ఆ వివరాలను గురించి మరోసారి చెప్పుకుందాం. ప్రతి రంగుకు ఓ ప్రత్యేకత ఉంది . ప్రతి మనిషికి ఉన్నట్టుగానే  .అయితే రంగుల గురించి ఎక్కడ చెప్పినా , ఎప్పుడు చెప్పిన ఎవరు చెప్పినా ,  మనసులో మెదిలే తొలి రంగు తెల్లని తెలుపు .

అందరూ ఇష్టపడేది  తెలు పే . పిండార బోసినట్లు వెన్నెల  ,పౌర్ణ మి  చంద్రుడు   , మల్లెలు  , ఐరావతం  ,పాలు ,నందివర్ధనం  , పారిజాతం ఎవరికి ఇష్టం కాదు చెప్పండి .  తెలుపు రంగులో ప్రత్యేకంగా ఉండే  కొన్నింటిని గురించి చెప్పుకుందాం . వాటి గురించి  మీకుచాలా  తెలుసని నాకు తెలుసు . అయితే అరుదుగాకనిపించి  , మురిపించి  మనల్ని  ఆలోచింపచేసే  కొన్ని విశేషాలను రేఖామాత్రంగా గుర్తు చేసుకుందాం.

మనిషి ఎప్పుడు మొదట  తన గురించి ఆలోచిస్తాడు  . తెలుపు రంగును బాగా అభిమానించే వారితో  మొదలు పెడదాం. తెలుపు రంగును ఇష్టపడేవారు పరిశుభ్రతను , పరిపూర్ణతను , నిరాడంబరతను  ఇష్టపడతారు .వీ రు నిజాయితీగా , అమాయకంగా ఉంటారు . అన్ని రంగులు తెలుపులో దాగినట్లుగా వీరి భావాలు అంత త్వరగా బయటపడవు . శాంతి ప్రియులు . ఎవరిపైన ఆధారపడి ఉండడం వీరికి నచ్చదు. ఎవరిని నొప్పించడం కూడా నచ్చదు . జీవితంలో వచ్చే కష్టసుఖాలను బ్యాలెన్స్ చేసుకోవడంలో నేర్పరులు  .ఏ విషయంలోనైనా పాజిటివ్గా ఆలోచిస్తూ  ,ఆత్మవిశ్వాసంతో మెలుగుతారు . ఇవన్నీ అధిక శాతం వారిలో కనిపించే  అంశాలు  .

ఇక్కడ నుంచి మెల్లగా జంతు లోకంలోకి అడుగుపెడదాం.

జంతు ప్రపంచం

తెలుపు రంగులో అనగానే గుర్తొచ్చేవి తెల్ల పులి  ,తెల్ల ఏనుగు  ,తెల్ల నెమలి ,కుందేలు .ఒక్కొక్క దాని గురించి కాస్త చెప్పుకుందాం.  మీకో విషయం తెలుసా?  జులై 29 నాడు ఇంటర్నేషనల్ టైగర్ డే గా జరుపుకుంటారుప్రపంచవ్యాప్తంగా  .  తెల్ల  పులులు  .తెల్లటి బొచ్చు  ,నల్లని చారలు ,తెల్లటి చర్మం  ,నీలి కళ్ళతో ఆకర్షిస్తాయి . ఇవి  బెంగాల్ పులి యొక్క ఉపజాతి. జన్యుపరమైన అమరికల వలన పులికి ఇలాంటి తెల్ల రంగు వస్తుంది . అరుదైన రకం  .ఎందుకంటే జన్మించిన ప్రతి పదివేల పులులలో ఒక్కటి మాత్రమే తెల్లనిది  . ఎదిగిన తెల్ల  పులి 570 పౌండ్ల వరకు తూ గుతుంది  .సాధారణ పులుల కన్నా పొడవు ఉంటుంది  .పది అడుగుల కంటే ఎక్కువ పొడవు  .గంటకు 60 మైళ్ళ వరకు పరిగెత్తగలవు . అంటే హైవే మీద పరిగెత్తే కారుతో సమానంగా ప్రయాణిస్తాయి .ఒక తడవకు దాదాపు 18 కిలోల మాంసాన్ని తింటాయి . ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాయి  .కానీ మంచి పెంపకం దారులు .

పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాయి . వీటికి ఎక్కువ  స్థలం కావాలి  .దాదాపు 20 చదరపు కిలోమీటర్ల విశా ల  ప్రాంతం అవసరం . . ఉండడానికి  ,తిరగడానికి  ,వేటాడ్డానికి  కనీసం ఉండాలి .నీటిలో  బాగా ఈదుతాయి  . పంజాలు ఈదడం లో సహాయపడతాయి  .7 మైళ్ళ వరకు ఒక తడవ వెళుతుంది ఈదుకుంటూ .దేశంలో 1561లో తొలిసారిగా తెల్ల పులి గుర్తించబడింది. ఈ విషయం అక్బర్ నామాలో  రాసి  ఉంది .  అడవుల్లో కనిపించడం అరుదు . ఎందుకంటే వీటి రంగే  వీటిని శత్రువులకు సులువుగా పట్టిస్తుంది  .ఎక్కువగా జూలలో ,థీమ్  పార్కులలో ఉంటాయి .

పులి తర్వాత గుర్తొచ్చేది తెల్ల ఏనుగు .దీన్నే వైట్ ఎలిఫెంట్ అంటారు  .వైట్  ఎలిఫెంట్ అంటాం కానీ  ,నిజానికి  వీటి చర్మం లేత రంగులో ఉంటుంది . కళ్ళు తెలుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి. థాయిలాండ్ లో ఎక్కువగా కనిపిస్తాయి . రాజరి  కానికి హోదాకు చిహ్నం   .భారతీయులకు తెల్ల ఏనుగు  అనగానే ఐరావతం గుర్తుకొస్తుంది  .అష్ట  దిగ్గజాలలో ఇది ఒకటి . తూర్పు దిక్కుకు ప్రాతినిధ్యం వహిస్తుంది  .ఇంద్రుని వాహనం కూడాను  .

దీని రంగు గురించి ఒక ప్రాచీనమైన కథ ఉంది  .ఒకసారి  దుర్వాస మహర్షి వెళ్తూ ఉండగా ఏనుగు ఎదుర్పడింది . అయితే  మహర్షిని చూసి నమస్కరించకుండా అహంకారంతో  ,వెళ్ళిపోయింది . ఆయనను గుర్తించనట్టుగా అన్నమాట . .చూసిన మహర్షికి కోపం వచ్చి . దాని నలుపు రంగులో మారిపొమ్మని  శపించారు  .దాంతో దానికి చాలా బాధేసింది . దుఃఖ మ్ వచ్చేసింది .  తెల్లటి ఏనుగు  కాస్త  నల్లగా మారి పోయింది  .ఏం చేయాలో తెలియలేదు  .  బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంది . బ్రహ్మదేవుడు నావల్ల కాదు  .ఈ పని కేవలం శివుడు మాత్రమే చేయగలడు  .వెళ్లి శివుడి గురించి తపస్సు చేయి అని చెప్పాడు  .అలాగే చేసింది . శివుడు ప్రత్యక్ష మై  , ఇక్కడ ఒక పుష్కరిణి  ఉంది  .అందులో వెళ్లి  ,స్నానం చేసి , దాని పక్కన ఉన్నదేవాలయంలో పూజ చేయి . నీ రంగు నీకొస్తుంది అని వ రమి చ్చాడట  .అంతే  అది పుష్కరిణిలో మునిగి లేవగానే  ,ఆ నలుపు రంగు పోయి   తెల్లటి తెలుపు మళ్ళీ  వచ్చేసింది  .  అందుకని ఆ  పక్కన  ఉన్న దేవాలయాన్ని ఐరావతేశ్వర ఆలయం అంటారు  .ఇది దారాసురం అనే గ్రామంలో ఉంది . ఈ గ్రామం శ్రీరంగానికి చాలా దగ్గరలో ఉంది .

చతురంగబలాలలో ఏనుగుది ముఖ్యమైన పాత్ర  .వీటిని పెంచడం చాలా ఖరీదైన వ్యవహారం .  ప్రత్యేకమైన ఆహారం , శిక్షణ వైద్యం అవసరం .ఒక కార్యక్రమం లేదా ప్రాజెక్ట్ ఖరీదు అయింది లేదా ఆ ఖర్చుకు తగినంత ఉపయోగం ఉండదు అని చెప్పడానికి వైట్ ఎలిఫెంట్ అనే పదం వాడతారు  . గంటకు 40 మైళ్ళ వేగంతో పరిగెత్తగలదు  . అందాన్ని  ఇచ్చే దంతాలే దీనికి శత్రువులు  . వీటి కోసం వేటాడే వారు ఎందరో .

అనేక సంస్కృతులలో ఏనుగులు  బలానికి  ,అదృష్టానికి ప్రతీక . వేల సంవత్సరాలుగా ఇవి మానవ సంస్కృతిలో ఒక భాగం  .మనకైతే ఏనుగు తల ఉన్న దేవుడు గణాలకు అధిపతిగా  , తెలివితేటలకు ,జ్ఞానానికి మూల కారణంగా కొలవబడుతున్నాడు . అదే గణపతి లేదా వినాయకుడు .

మయూరం

అందరికీ ఇష్టమైన పక్షి నెమలి.  పించం  నెమలికి అందం .  అందంగా హుందాగా మహారాణిలా పురివిప్పిన  తెల్ల నెమలి మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంది , ధవళ  కాంతులతో మనసు దోచుకుంటుంది  . తెల్ల నెమలి  నెమలి జాతిలో అరుదైన రకం . జన్య పరమైన లోపం వల్ల తెల్లగా ఎదుగుతుంది . ఈ కారణంగా ఈకలు  ,చర్మం తెల్లగా ఉంటాయి . ఇంకో వింత సంగతి చెప్పనా ! తెల్లనెమలి  పుట్టుకతో పసుపు రంగులో  ఉంటుంది .పెరిగే కొద్దీ పసుపే తెలుపు  రంగుగా రూపాంతరం చెందుతుంది . ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుం ది .  అడవుల్లోఇవి  కనిపించడం అరు దు  .ఎందుకంటే అక్కడ మరింత సులువుగా పట్టుబడిపోతాయి. బ్రతికి బట్ట కట్టడం చాలా కష్టం  .ఇంకో సమస్యతెల్ల నెమలి తో  కలవడానికి ఆడ నెమళ్ళూ  త్వరగా ఇష్టపడవు . అందుకని వీటిని ప్రత్యేకంగా పెంపక కేంద్రాలలో సిద్ధం  చేస్తారు .

సుబ్రమణ్య స్వామి వాహనము నెమలి  .క్రిస్టియానిటీలో తెల్ల నెమలిని ఏసుక్రీస్తు ప్రతీకగా  నమ్ముతారు . బౌద్ధమతంలో ఇది నిర్వా ణానికి గుర్తు. ప్రపంచవ్యాప్తంగా నెమళ్లు అదృష్టానికి , అభివృద్ధికి చిహ్నాలని  నమ్ముతారు . మన జానపద కథల్లో  అందానికి గర్వానికి గుర్తు . ఇవి సర్వభక్షకులు . కీటకాలు  ,పువ్వులు,విత్తనాలు  ,చిన్న పురుగులు , ఎలుకలు  ,బల్లు లు అన్నీ తింటాయి . హానికరమైన కీటకాలను తినడం వల్ల రైతుకు మంచి నేస్తం . మనదేశంలో నె మళ్లను వేటాడు నిషేధం  .ఈసారి హైదరాబాద్ లోని zoo  కి వెళ్ళినప్పుడు చూడండి . అక్కడ తెల్ల నెమ ళ్ళు మిమ్మల్ని పలకరిస్తాయి .

ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ జన్యుపరమైన మార్పులతో పుట్టిన ప్రాణులు . అలా కాక సహజ సిద్ధంగా ఎక్కువ శాతం తెలుపురంగుతో  అప్పుడప్పుడు గోధుమరంగు  మచ్చలతో  ,మనల్ని మరిపించి  ,మురిపించే బుల్లి ప్రాణి మరొకటుంది  .అది  అందరికీ ఇష్టమైనది కూడా  .

కుందేలు

అదే కుందేలు  .తెల్లని పాలలాంటి రంగు  ,పట్టుకుచ్చు లాంటి వెంట్రుకలు దీనికి పె ట్టని సొమ్ములు  .కుదురుగా ఒకచోట ఉండక  ,హడావుడిగా  ,సందడిగా తిరిగే చిరు ప్రాణి  . శేషము , బన్నీ  ,శశకం  ,కో ని అని కూడా పిలుస్తారు  ,వన్యప్రాణి  .శాకా హారి . చిన్న సైజువి ఐదు సంవత్సరాల వరకు జీవిస్తే  ,కొంచెం పెద్ద రకంగాఉండేవి 12 సంవత్సరాల వరకు బతుకుతాయి  ,సంఘజీవులు .గుంపుగా ఉండడానికి ఇష్టపడతాయి  .ఇంట్లో పెంచాలనుకుంటే కనీసం రెండింటినైనా ఎంచుకోవాలి .

ప్రత్యేకతలు

వీటి దంతాలు జీవితమంతా పెరుగుతాయి  .తినకపోతే  ,అవి మరింత పెరిగి దంత సమస్యలు వస్తాయి . నీళ్లు బాగా తాగుతాయి. ఇంట్లో పెంచేవారు తప్పనిసరిగా వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసి ఉంచాలి. తరచూ వాటిని మార్చాలి  .చాలామందికి కుందేలు ఆహారం అంటే క్యారెట్లు అని నమ్మకం  .కానీ ఇది పొరపాటు  .క్యారెట్ లలో చక్కెర శాతం అధికం కాబట్టి  ,అప్పుడప్పుడు ఇవ్వాలి  .కానీ రోజు కాదు . వీటికి బాగా వ్యాయామం అవసరం . అందుకు విశాలమైన స్థలం కావాలి. అక్కడ అవి ఎగురుతాయి  . దూకుతాయి  ,పరిగెత్తుతాయి , కాళ్ళను విశాలంగా సాగదీస్తాయి  .ఇవన్నీటికి స్థలం  అవసరం కదా  !చెవులు బాగా పెద్దవిగా ఉంటాయి  .అందుకని చెవుల పిల్లి అని కూడా అంటారు వీటి వినికిడి శక్తి సా టి లేనిది  .ఈ చెవుల ఆధారంగా తలను 180 డిగ్రీల వరకు తిప్పి చూడగలవు .

ఒక U K  లోనే  రెండు మిలియన్లకు పైగా పెంపుడు కుందేలు ఉన్నాయని అంచనా. రెండు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు వరకు ఎగర గలవు . పిల్లులవలే  వీటికి లిట్టర్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. వీటి జీర్ణశక్తి ప్రత్యేకమైనది . పీచున్న పదార్థాలను ఎక్కువగా తింటాయి       . చాలా జంతువులకు ఆహారం మనుషులతో సహా .

కళ్ళు ఎక్కువగా ముదురు గులాబీ రంగులో స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటాయి. ఆహారాన్ని నము లుతూ  అటు ఇటు సంచరిస్తూ మనల్ని ఆనందింప చేసే చిట్టి ప్రాణి  కుందేలు .

శ్వేత ప్రపంచం శీర్షికలో  ఇప్పటిదాకా వనవిహారం  చేశాం . జం తువులు మనలా నడవవు. గెంతుతాయి .పరిగెత్తుతాయి. దూకుతాయి . మనమూ అలాగే  దూకి వంటింట్లోకి జొరబడదాం. వంటింట్లో బోలెడు దినుసులు అవి దాచుకోవడానికి బోల్డ్ బోల్డ్ డబ్బాలు  ఉంటాయి .  వెతుకుదాం పదండి .

వంటింట్లో కాలు  పెట్టగానే తెల్లనిది . నిత్యావసరమైంది ఏది అనగానే తొluత గుర్తుకొచ్చేది లవణం  .అదేనండి  రోజు వాడే ఉప్పు .దాన్నే సోడియం క్లోరైడ్ అంటారు .మాకు ఉప్పు గురించి  తెలుసు . అది తక్కువైనా కష్టమే ఎక్కువైనా కష్టమే అంటారా ! మీరు అనుకునేది నిజమే  .అయితే ఇవాళ మరి కాస్త లోతుగా చెప్పుకుందాం  .ఉప్పు ఆహారానికి రుచి మాత్రమే కాదు  .ఇంకా ఎన్నింటికో అవసరం  .ఉప్పు తక్కువైతే ఆవకాయ చెడిపోతుంది  .ఆహార పదార్థాలను నిలవ చేయడానికి ఉప్పునే వాడతాం. ఆహారానికి రుచిని ఇవ్వడంలో ముఖ్యపాత్ర ఉప్పుదె . పచ్చళ్ళు , చేపలను నిలువ చేయడానికి కూడా ఇది అవసరం.

కొన్ని వందల ఏళ్ళ క్రితం ఉప్పును ద్రవ్యంగా వాడేవారు  .బ్రిటిష్ వారు ఉప్పుపై విధించిన పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ దండి ఉప్పు సత్యాగ్రహం కూడా చేశారు  .ఉప్పు ఎక్కువగా వాడితే ఆహారం రుచి మారుతుంది  .తరచు  అలా జరిగితే రక్తపోటు  ,గుండెజబ్బులు  ,మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలు  పెరుగుతాయి .  గాయాలై నప్పుడు ఉప్పు నీళ్లతో కడిగితే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు బాగా తగ్గుతాయట  .షడ్రుచుల్లో దేని ప్రభావమైనా  తగ్గించే శక్తి ఒప్పుకుంది  .అందుకే దాన్ని రుచుల్లో రారాజు అన్నారు .

చాలా పిరికివాడని చెప్పడానికి ఫ లా నా వ్యక్తి ఉప్పు పిరి కి అంటారు . పల్లెటూర్లలో ఆడే ఆట పుప్పన బట్టి  .ఈ ఆట మధ్య యుగాల్లోనూ  ఆడేవారని మనకు ఆధారాలు ఉన్నాయి  .ఉప్పు అని కూత పెడుతూ మధ్యలో గీసిన గీతలను దాటుకుంటూ చివరికి వెళ్లి పిడికెడు మట్టిని తెచ్చి స్వ స్థానానికి వస్తే గెలిచినట్లు . అలా తేవడం గెలుపుకు చిహ్నం  .తేలేని నివాడు  ,భయపడి ముందుకు సాగనివాడు ఉప్పుపిరి కి . అంటే పరమ భయస్తుడు  .

దీని గొప్పదనాన్ని చెబుతూ సుమతి శతకకర్త ఉప్పే పసరుచుల కెల్లా అన్నాడు  .నిజజీవితంలో ఉప్పు మనకు అత్యవసరం  .  ప్రపంచంలో చాలామందికి చాలా కాలం వరకు ఉప్పు తయారీ తెలీదు. మధ్యయుగాల్లో టి బేట్ వంటి దేశాల్లో ఉప్పు బిళ్ళలు రూపాయి బిళ్ళలుగా చలామణి అయ్యేవి. ఇంత విలువ గలది కనుకనే వాని ఉప్పు తిని పెరిగాను  అనే సామెతపుట్టినది .  వేద కాలం లో  నుండి  మనకు  ఉప్పు  తయారీ  తెలుసు  .దాన్ని వాడకమూ తెలుసు  .గుర్రం మొదలైన పశువులకు దానాలో ఉప్పు  , సైంధవ లవణం కలిపి పెడతారు . మర్చిపోయాను రాత్రి పూట ఉప్పు అనకూడదు . బుట్టలోది  .రుచి అని పెద్దవాళ్ళు ఒకప్పుడు చెప్పేవాళ్ళు . ఇప్పుడు  అవన్నీ మానేశామనుకోండి

సంస్కృతంలో లవణ శబ్దం నుంచి లావణ్యమ్  ఏర్పడింది . ఉప్పులో కనిపించే మెరుపును స్త్రీలలో కనిపించే నిగారింపుతో పోల్చారు .  ఇంత కథ ఉంది మన రోజు వాడే ఉప్పులో.

బియ్యం కాని  బియ్యం

బియ్యం కాని బియ్యం అదేనండి  . సగ్గుబియ్యం.ఇవి టాపీయోకా  అనే మొక్క వేర్ల నుండి తయారవుతాయి . దీని  ఉపయోగాలు ఎన్నో  .శరీరానికి త్వరగా శక్తినిస్తుంది . తేలికగా అరుగు తుంది కాబట్టి ఉపవాస సమయంలో ఎక్కువగా వాడతారు  .పోషకాలు  తక్కువగా ఉంటాయి కాబట్టి  ఇతర పదార్థాలతో కలిపి తినడం మంచిది. మహారాష్ట్ర ప్రాంతాల్లో వీటిని వేరుశెనగ గుళ్ళు, బంగాళాదుంపలతో కలిపి వాడుకుంటారు .వండడా నికి  ముందు  బాగా నానాలి    . లేకపోతే త్వరగా అరగదు . రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది కనుక మధుమేహంతో బాధపడే వాళ్ళు తగు మాత్రమే వాడాలి  .కడుపుపై మృదువుగా పనిచేస్తుంది.

ఇంకొక విషయం  .చరిత్ర ప్రకారం క్రీస్తుశకం 18 00ప్రాంతంలో ట్రావెల్కూర్ రాజ్యంలో గొప్ప కరువు వచ్చిందట  .అప్పటి రాజు తిరునాళ్ రామ వర్మ అతని తమ్ముడు తిరుణాల్ మహారాజు ప్రజలు కరువుని ఎదుర్కోవడానికి అనేక చర్యలను అనుసరించారు  .అందులో ఒకటి ఆహార వనరుగా   ఈ పిండి దుంపను ప్రవేశపెట్టడం  .రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజలకు కర్ర పెండలం నమ్మకమైన పోషకమైన జీవనాధారంగా మారింది  .బియ్యం ఖరీదైన ఆహారంగా మారిన సమయంలో ప్రజలు వీటిపై ఆధారపడేవాళ్లు ఇది 3000 సంవత్సరాలుగా చైనీస్ వంటకాలలో కీలక పదార్థం .

తర్వాత దేని గురించా అని ఆలోచిస్తున్నారా  ?

తర్వాతది బార్లీ  .  ప్రపంచంలో నాలుగవ ముఖ్యమైన పంట బార్లీ  . ఇండియాలో ఆరవ స్థానంలో దీని దిగుబడి  . శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది .  మంచి పోషకాలు కలిగిన ధాన్యం  .మిడిల్ ఈస్ట్ ప్రాంతాలలో వాడిన మొట్టమొదటి సి రియల్  .కనీసం 9000 సంవత్సరాలకు పూర్వమే దీని పండించేవారు అనడానికి చారిత్రక ఆధారాలున్నాయి . ప్రాచీన కాలంలో ఈజిప్టులో పండించేవారు  .ఇందులో అధిక శాతం ప్రోటీన్ బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. పండిన పంటలో అధిక భాగం మాల్టుగా మారుస్తారు . పశువుల దానాలో వాడే ముఖ్య పదార్థం కూడా . మాల్ట్ సారాన్ని పసిపిల్లల , వృద్ధుల ఆహారంలో వాడుతారు.

జీర్ణ క్రియలో వచ్చే సమస్యలను సవరించడానికి బార్లీ నీటిని కొంచెం కొంచెంగా దినం అంత తాగా లి . మిగిలిన ఆహారం పరిమాణాన్ని తగ్గిస్తూ ఇలా తాగడం అనేది నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో  అలవాటు .బార్లీ ని ఆహారంగా పానీయాలలో పశువుల దానా గా ఉపయోగిస్తారు . ఇందులో ఫైబర్ ఉంది . కొలెస్ట్రాల్  ,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో  చాలా ఉపయోగం  .ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది   .మలబద్ధకాన్ని నివారిస్తుంది  .క్యాలరీలు బాగా తక్కువ. కడుపు నిండిన భావన కలిగిస్తుంది  .ఈ కారణంగా బరువు తగ్గడంలో కూడా ఇది   ఉపకారి . గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది  .పురాతన రోమ్ లో గ్లాడియేటర్లు బార్లీని ప్రధాన ఆహారంగా తీసుకునేవారుట . దీన్ని సాగు కూడా చాలా సులభం  .అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ తట్టుకొని పెరుగుతుంది  .

సంపూర్ణ ఫలం

సంపూర్ణ ఫలం అంటే మనకు తెలిసిన కొబ్బరికాయ . కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటారు . అంటే చెట్టులోని ప్రతి భాగం మనకు ఉపయోగిస్తుంది . నిజం చెప్పాలంటే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పెళ్లి  ,నిశ్చితార్థం నుంచి మొదలైన కొబ్బరితో ప్రయాణం చివరి వరకు కొనసాగుతుంది . హోమాలు, పూజలు, యజ్ఞాలు , పండుగలు ,శుభకార్యాలు అనేక ధార్మిక కార్యక్రమాల్లో కొబ్బరికాయ లేనిదే పని నడవదు.

దక్షిణ భారతదేశంలో చాలా ఇళ్లల్లో కొబ్బరి లేనిదే  రోజువారి వంట పూర్తి అవ్వదు . కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అంచనాల ప్రకారం కొబ్బరి ఉత్పత్తిలో కేరళదే 2018 వరకు అగ్రస్థానం ప్రాచీన కాలం గురించి చెప్పాలంటే పురావ స్తు తవ్వకాలలో , ఆయుర్వేదంలో , బుద్ధుని జాతక కథల్లో  ,చైనా అరేబియా యాత్రిkuల అనుభవాల్లో దీని ప్రసక్తి ఉంది . ఒకటి రెండవ శతాబ్దల ప్రారంభంలో కొబ్బరికాయ ధార్మిక కార్యక్రమాలకు వాడడం మొదలై ఉండొచ్చని ఒక అంచనా .1958లో ప్రచురించబడిన ఒక పరిశోధన పత్రంలో మనిషి ఆవిర్భావానికి ముందే పురావస్తు శాఖకు లభించిన శిధిలాల ప్రకారం కొబ్బరి చెట్లు ఉన్నాయని వ్యాసరచయితలు  కే పి వి మీన న్ , పండలై పేర్కొన్నారు .

శిలా శాసనాల మీద కూడా దేవాలయ ఆస్తులుగా ఉన్న కొబ్బరి తోటల ప్రస్తావన ఉంది   . అంతేకాదు మత్స్య పురాణం , బ్రహ్మవైవర్త పురాణం , బ్రహ్మ పురాణాలలో కొబ్బరి ప్రసక్తి ఉంది . చరక సంహితలో కూడా దీని గురించి చెప్పబడింది . ఆహారంగా మాత్రమే కాకుండా , దానికి ఉన్న ఇతర ఆరోగ్య – ఔషధ – సౌందర్య ప్రయోజనాల దృష్ట్యా దీని కల్పవృక్షం అని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు  .ఆధ్యాత్మికంగా కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా పోలుస్తారు .  కొబ్బరికాయలు దిష్టి తీయడానికి కూడా వాడుతారు  .నువ్వు నక్షత్రాలను లెక్కపెట్టగలిగితే కొబ్బరితో వచ్చే ప్రయోజనాలను లెక్కించగలవు అనేది ఫిలిప్పీన్స్ సామెత  .సంప్రదాయ పద్ధతుల్లో తీసిన కొబ్బరిపాలను డైరీ ఉత్పత్తులకు బదులుగా వాడవచ్చు . కొబ్బరిలో ఉండే కొవ్వు పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి  .కొబ్బరిలో ఉండే రాగి ,ఇనుము శరీరంలో రక్తం స్థాయిలని నిలిపి ఉంచుతాయి కొబ్బరి కు న్న బహుముఖ ప్రయోజనాల వల్ల సాంఘికంగా ,ఆధ్యాత్మికంగా , ఆర్థికంగా ఈ పంటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

బియ్యం

ఇక మన ముఖ్య  ఆహారమైనటువంటి బియ్యం దగ్గరికి నడుద్దాం . కోట్లాది ప్రజలకు ప్రధాన ఆహారం బియ్యం  .ఇవి పండినప్పుడు వడ్లు . పొట్టు తీసితే బియ్యం .ఉడికితే అన్నం  .ఆసక్తికరమైన విషయాలు ఎన్నో కలిగి ఉన్న ధాన్యం బియ్యం  .అన్నం అంటే పోషించేది ఆయుష్షుని ఇచ్చేది సంరక్షించేది మాత్రమే కాదని సంసార జీవితాన్ని సుఖమయం చేసేదని ప్రఖ్యాత వైద్యుడు సుస్రుతుడు 2000  సంవత్సరాల కిందటే  చెప్పాడు  .వేలాది సంవత్సరాల నుంచి ఈ ధాన్యం మనకు తెలుసని , చైనా , దక్షిణ తూర్పు ప్రాంతాల్లో పండించే వారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మందికి ఇది ప్రధాన ఆహారం  .శక్తిని పిండి పదార్థాలని ఇస్తుంది .

చాలా ఆసియా దేశాల్లో ఈ పంటను పవిత్రంగా భావిస్తారు  .వేడుకల్లో సంప్రదాయాల్లో తప్పక ఉపయోగిస్తారు . ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మించిన బియ్యం రకాలు ఉన్నాయి   .దేనికదే పోషకాలు , రంగు , రుచి లలో విభిన్నం . ఒక అంచనా ప్రకారం ఒక కిలో బియ్యం పండడానికి సగటున 5000 లీటర్ల నీరు కావాలి  .

కొన్ని సంస్కృతుల్లో బియ్యం అభివృద్ధికి ప్రజన న శక్తికి ప్రతీక . 9000 సంవత్సరాల ముందు నుంచి దీని పండిస్తున్నాం .సంప్రదాయ సాగు విధానాలు ఒక తరం నుంచి మరో తరానికి అందించబడుతూ వచ్చాయి  .ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు ఉడికించడం , ఆవిరిపై ఉడికించడం  ,వేయించడం  ,అంతేకాదు వీటిని వాడి  అసంఖ్యాకమైన వంటకాలు కూడా చేయొచ్చు.

ఇంకా ఉంది

ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో బియ్యాన్ని వాడుతారు  .బియ్యం కడిగిన నీళ్లు కూడా సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు  .దక్షిణ భారత దేశంలో  పిల్లలకు తినిపించే  మొదటి ఆహారం బియ్యమే . అంటే అన్నమే . బియ్యాన్ని  వేయించి  , రవ్వలాగా విసిరి , ఉడికించి  పిల్లలకి తినిపిస్తారు  .

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం చేసే అంశాలలో వరి ఉత్పత్తి ఒకటి ఎందుకంటే ప్రతి ఏటా 500 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నాయి కోట్లాది ప్రజలకు ఆహార భద్రతను కల్పించేది వరి పంట మాత్రమే . జవాన్ లో దీని పవిత్రమైన పంటగా భావిస్తారు  .సంప్రదాయక వేడుకల్లో , పెళ్లిళ్లలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. బౌద్ధ సంప్రదాయంలోను దీనికి ప్రముఖ స్థానం ఉంది  . ఆరోగ్యపరంగా చూస్తే సులువుగా వేగంగా జీర్ణం  అవుతుంది  .

చివరగా మరొక్క మాట అన్నం తినడానికి వేళాపాళ  తప్పనిసరిగా ఉండాలి .వేళకు  తింటేనే ఆయువు   , వీర్యపుష్టి ,బలం శరీర కాంతి పెరుగుతాయి .

మన వంటింట్లో ఉండే జంట కవుల గురించి చెప్పుకోకుంటే ఈ వ్యాసం అసమగ్రం. అసంపూర్ణం . అవే పాలు పె రుగులు .

క్షీర సాగరం

విశ్వమంతా వ్యాపించిన ముఖ్య ఖాద్య  పదార్థం పాలు . ఆరోగ్యాన్ని పెంచేది  .ఆరోగ్యం బా లేకుంటే కోలుకోవడానికి సహకరించేది పాలే . ఇది సంపూర్ణ ఆహారం అని చెప్పొచ్చు . కొబ్బరి సంపూర్ణఫలమైతే పాలు నిస్సందేహంగా సంపూర్ణ ఆహారం  .అనాది నుంచి పశు సంబంధిత పాలను మానవులు వాడుతూ ఉన్నారు . సాధారణంగా ఆవు, బర్రె ,మేక పాలను వాడుతారు  .కొన్ని ప్రాంతాల్లో గుర్రపు పాలు కూడా వాడుతారు .కొన్ని ప్రత్యేక సందర్భాలలో గాడిద పాలను మందులా  వాడతారు  .

తక్కువ చక్కెరతో తల్లిపాలకు రెండు రెట్ల ప్రోటీన్ తో ఆవు పాలు ఉంటాయి  .ఆవు పాలలో కంటే గేదె  పాలలో కొవ్వు ఎక్కువ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అత్యవసరమైన విటమిన్లు, అనేక ఖనిజాలు ,కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి ఆవు పాలలో.

ఒక లీటర్ పాలలో ఒక మనిషికి ఒక రోజుకు అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్ మొత్తం లభిస్తాయి. పాలు అరగడానికి గంటన్నర సమయం పడుతుంది. ప్రాచీన వైద్యుడు చరకు ని అభిప్రాయంలో పాలు మనలో బలాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అలసటను దూరం చేసి ,శక్తినిస్తాయి .ఆధునిక పరిశోధనలు చరకుని  అభిప్రాయాన్ని బ లపరుస్తున్నాయి .పసిపాపల నుండి పండు వృద్ధుల వరకు అందరికీ సరిపోయే ఆహారం  . గర్భిణులకు బాలింతలకు సమానంగా ఉపయోగం ఈ పాలే . సన్నగా బరువు తక్కువగా ఉన్న వారికి పాలు గొప్ప ఆహారం . రక్తప్రసరణ సరిగా లేని వారికి ఇవి  చాలా ఉపయోగం. ఎసిడిటీకి మంచి మందు చల్లని పాలు .నిద్ర పట్టని వారికి  పడుకునే ముందు కొంచెం తేనె కలిపిన గోరువెచ్చని పాలు గొప్పగా పనిచేస్తాయి  .జలుబు, గొంతులో గరగర ,టాన్సిలైటిస్ అస్తమా వంటి శ్వాస సమస్యలకు లాభకారి  .ఓ గ్లాస్ పాలలో చిటికెడు పసుపు నాలుగు లేక ఐదు నలగొట్టిన మిరియాలు కలిపి మూడు రోజులు వరసగా రాత్రులు తాగితే మంచి ఫలితం ఉంటుంది  .

సౌందర్య పోషణలోనూ ప్రముఖ పాత్ర పాలది . పాల ప్రసక్తి లేకుండా మనకు విందులు, పండుగలు, వేడుకలు, వినోదాలు పూర్తి కావు. పూజలోనూ పాలది ప్రముఖ  స్థానం .

పాలు అనే మాటను  భాగం అనే అర్థం లోను వాడతాం. ఈరోజుల్లో సోయా గింజల నుంచి బాదాం కొబ్బరి లతో సహా అనేక పదార్థాల నుండి పాలను తయారు చేస్తున్నారు .బజార్లో అందుబాటులో ఉన్నాయి కూడా.

 పాముకు పాలు పోసి పెంచిన విషమే కక్కుతుంది

 పాలలో పంచదార ఒలికినట్లు అని సామెతలు ఉన్నాయి. మేకపాలు అనగానే గాంధీజీ గుర్తొస్తారు. తెల్లని వన్నీ  పాలని నల్లనివన్నీ నీళ్లు అనుకుంటాడు అని అమాయకులను గురించి చెప్తూ ఉంటాం. ప్రపంచంలోని  పాల ఉత్పత్తిలో 85% ఆవుపాలు 11% గేదె పాలు 2 శాతం మేకపాలు ఉంటాయి. ఉత్తర భారతంలో పాలను అలాగే తీసుకుంటారు . అదే దక్షిణ దేశంలో కాఫీ లేదా టీ ద్వారా తీసుకుంటాం. పెరుగు లేదా మజ్జిగ రూపంలోనూ వాడతాం .

మరి కాస్త

పాలలోంచి తయారయ్యే  ఉత్పత్తులు లెక్కలేన  న్ని .  పెరుగు ,మజ్జిగ, మీగడ ,నెయ్యి   అందరికీ నచ్చిన పనీ ర్  గురించి చెప్పే పనేలేదు  .మన మిఠాయిల్లో పాల ఉత్పత్తులు ముఖ్యపాత్ర వహిస్తాయి. పూర్వం రోజుల్లో ముఖ్యంగా గ్రామాల్లో అందరి ఇళ్లల్లోనూ పాడి ఉండేది. పాలు పెరుగు అమ్మడం నా మోషిగా భావించేవారు .మజ్జిగ అనగానే నాకు మధురానగరి  లో చల్ల నమ్మ బోదు  అని చక్కటి అందమైన గీతం గుర్తొస్తుంది దాని గురించి మరోసారి చెప్పుకుందాం.

నాగుల చవితికి నాగుల పంచమికి పుట్టలో పాలు పోయడం తెలుగువారి సనాతన సంప్రదాయం .మనం కొలిచే లక్ష్మీదేవి క్షీరసాగర కన్యక కదా! పాలు పొంగిస్తేనే గృహప్రవేశ వేడుక మొదలవుతుంది .పాలు అనగానే క్షీరసాగర మధనం చవితి  చంద్రుని కథ గుర్తు వస్తాయి. పాల ఉత్పత్తుల కథ చెప్పాలంటే మరో భారతం అవుతుంది

పెరుగు

పెరుగు గురించి చెప్పకుండా పాల కథ అసంపూర్ణం .పాలను  కాసింత పెరుగు వేసి ,తోడు పెడితే వచ్చేదే పెరుగు .ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేది. ఆ  రుచి మళ్లీ మళ్లీ  తినాలనిపిస్తుంది .యూరప్ అమెరికాలో సాధారణంగా ఆవుపాల పెరుగును వాడితే ,భారతదేశంలో గేదె పెరుగును ఎక్కువగా వాడతారు.రష్యాలో మేక, గొర్రె ,గుర్రం పాలను ఎక్కువగా పెరుగు తయారీలో వాడతారు .పెరుగు నాణ్యత మంచి పాలపై చక్క టి తోడు పై ఆధారపడి ఉంటుంది .వేసవికాలంలో పెరుగు త్వరగా తోడుకుంటుంది .చలికాలంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది .కనుక పైనుంచి పెద్ద గిన్నెనో  కంబళినో కప్తారు .వేడి దినాల్లో పెరుగు తయారు కావడానికి 6 నుంచి 8:00  గంటలు పడితే చలికాలంలో 12 నుంచి 16 గంటల కావాలి .ఆహార శాస్త్రాన్ని గమనిస్తే టర్కీలో   తొలుత పెరుగు తయారైందని తెలుస్తుంది. మన దేశంలో పాలతోపాటు పెరుగునూ  సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.

పెరుగు శక్తి నిచ్చే  ఆహారం .అవసరమైన ప్రోటీన్ విటమిన్లు మినరల్లు  ఉంటాయి .క్యాల్షియం కూడా దండిగా ఉంటుంది .దీనిలోని ప్రోటీన్లు పాల ప్రోటీన్లకన్నా తేలిగ్గా జీర్ణం అవుతాయి .ఒక అంచనా ప్రకారం తా గిన పాలలో 32 శాతం గంటలో జీర్ణ మైతే అదే గంటలో 91% పెరుగుజీర్ణ మౌతుంది .  పేగులపై ,పొట్టపై మృదువుగా పనిచేస్తుంది .మృదువైన చర్మానికి ఓట్స్ పొడిని పెరుగుతో కలిపి ప్యాక్లా వాడతారు. సౌందర్య సాధనంగానే కాదు, భారతీయులు చాలా వంటల్లో పెరుగును చేరుస్తారు. కేవలం పెరుగు ముఖ్య పదార్థంగా లస్సీ , దహి వడ ,దధి  ఓ ధనం వంటి వంటలు ఎన్నో చేస్తారు. రోజు పెరుగు తినడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి ,గుండె జబ్బులు రావని పలు అధ్యయనాల్లో తేలింది . దీని లోని  లాక్టోబర్ బ్యాక్టీరియా శరీరంలో తెల్ల రక్త కణాలను పెరిగేలా చేస్తుంది.

చాలామందికి పెరుగన్న తినకపోతే భోజనం పూర్తయినట్లు కాదు రోజు పెరుగు సేవిస్తే ,వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది . ఆయుర్వేదం గేదె పాల పెరుగు కంటే ఆవుపాల పెరుగు మంచిదంటుంది .అయితే ఈ ప్రయోజనాలన్నీ తాజా పెరుగులోనే  లభ్యం .మనదేశంలో ఉత్పత్తి అయ్యే పాలలో దాదాపు 46% పాల రూపంలో వాడితే తక్కిన 54% పాల పదార్థాల వినియోగిస్తున్నాం.

ఇవన్నీ మనకు తెలిసినవే అంటారా . నిజమే. మరోసారి ప్రేమగా , అభిమానంతో గుర్తు చేసుకోవడమే .

రెండవ  , చివరి భాగం త్వరలో  .

మళ్ళీ కలుద్దాం .

Written by Vijaya Kandala

నా పేరు విజయ కందాళ.
35సంవత్సరాల బోధనానుభవం.ఫోటోగ్రఫీ,యాత్రా సక్తి నా హాబీలు.నీహారిణి గారి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి ప్రవేశించాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పసిదనంతో ప్రయాణం (కాలమ్)

“ఛోటా (హిమాలయన్) చార్ థామ్ యాత్ర”