Maneesha Josyula
మనీష జోస్యుల గణితంలో పట్టభద్రులు, మరియు కంప్యూటర్ విజ్ఞానంలో పట్టభద్రులు. గణిత అధ్యాపకులుగా, సాఫ్ట్ వేర్ లో Sr. General Manager గా ఉద్యోగాలు చేశారు, HYDSPIN (Software Process Improvement Network) coregroup member గా సేవలు అందించారు. Lioness District 320A Vice President Region II గా స్త్రీ శిశు సంక్షేమానికి సేవలు అందించారు. సంస్కృతభారతీ బాలకేంద్ర సంస్కృత అధ్యాపకురాలు గా సేవ అందించారు. స్వచ్ఛంద Process Quality Consultant గా, Vedic Maths Trainer గా చేశారు. ప్రస్తుతం బాలలకి ఉచితంగా Softskills, సంస్కృత బోధన చేస్తున్నారు. సంస్కృతభారతి సంస్థ ద్వారా సంస్కృత కోవిద ఉత్తీర్ణత పొందారు. కవితా సంపుటాలు, కథా సంపుటాలు ప్రచురించారు. హిందీ, తెలుగు, ఆంగ్లం, సంస్కృతంలో నృత్యనాటికలు రచించి దర్శకత్వం చేశారు. తెలుగు యూట్యూబ్ లఘుచిత్రాలు , సంస్కృత భాషలో బాలల యూట్యూబ్ లఘుచిత్రాలు రచించి, దర్శకత్వం, ఎడిటింగ్ చేశారు. ‘భర్తృహరి సుభాషితములకు కథలు’, ‘ద్వైతాద్వైతము’ పుస్తకాలు తెలుగులో, మరియు ‘Epic Stories for Vemana Sumati Poems’ పుస్తకం ఆంగ్లంలో రచించారు. వీరు రచించిన కవితలు వివిధ సంకలనాలలో, పత్రికలలో ప్రచురించబడ్డాయి, సభలలో, సమావేశాలలో, కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. . అధ్యాపకులుగా ‘Best Teacher’ అవార్డు, సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో ‘Best Instructor’, ‘Bravo’ అవార్డులు, PMI Hyderabad ‘Gyan Lahari’ అవార్డు, Lioness మమతా క్లబ్ ‘Best President’ అవార్డు, HYDSPIN ‘Continuous Executive Director service’ అవార్డు, బాలికల ఉన్నత విద్యకి సహాయం అందించినందుకు ‘Indradhanush Award’, బాల్యంలో రవీంద్రబాలానందసంఘం ‘Best President’ అవార్డు, * భగవద్గీత సర్టిఫికెట్ ISKON * ‘గీర్వాణనిధి’ 7 levels ఉత్తీర్ణత సర్టిఫికెట్ * తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయ ‘సంస్కృత క్విజ్ సర్టిఫికెట్స్ అందుకున్నారు. సాక్షి TV ‘స్వేచ్ఛ’ అనే కార్యక్రమంలో ‘మహిళా సాధికారత’ అనే అంశంపై ముఖాముఖి, ETV2లో ‘తెలుగు వెలుగు’ కార్యక్రమంలో ‘భర్తృహరి సుభాషితములకు కథలు’ పుస్తకం పై ముఖాముఖి, యాదగిరి దూరదర్శనం ‘సాహితీ సౌరభాలు’ కార్యక్రమంలో ద్వైతాద్వైతము పుస్తకం పై ముఖాముఖి, ETV అభిరుచి ‘అతిథి’ కార్యక్రమంలో బొమ్మల కొలువు నైవేద్యాలపై మహిళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ద్వైతాద్వైతం పుస్తక వివరణతో 9 ఎపిసోడ్ లు “క్యాపిటల్ భక్తి ఛానెల్” వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక 7 ఎపిసోడ్ లు సంక్రాంతి, భోగి, కనుము, రథసప్తమి గురించి ఇదే యూట్యూబ్ ఛానెల్ వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. . మనీషా జోస్యుల గారు బాల్యం లో Dr. ఉమారామారావు వద్ద భరతనాట్య శిక్షణ పొందారు. శ్రీ గోపాల్ రాజ్ భట్ వద్ద జానపద నృత్యం శిక్షణ పొందారు. డాన్స్ ట్రూప్ తో కలిసి వివిధ రాష్ట్రాలలో జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. * పాఠశాల, కళాశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో, పూర్వవిద్యార్థిని సమ్మేళనంలో నాట్యప్రదర్శనలు ఇచ్చారు. * Telangana రాష్ట్ర సంస్కృతి నృత్యం గణతంత్ర దినోత్సవం పెరేడ్ లో డిల్లీ, హైదరాబాదు లో పాల్గొన్నారు. * ప్రతి సంవత్సరం దసరాకి బొమ్మల కొలువు తీర్చడం, హస్తకళల పైన అభిరుచితో వివిధ ఆకృతులు బొమ్మలు తయారు చేస్తారు. _**__