“అమ్మా నిధీ,ఒక్కసారిచిరాకుపడకుండానా మాటవిను. మాతృత్వం ఆడవాళ్లకు మాత్రమే దొరికిన వరం, దానిని అలా జారవిడవకు. ఈరోజు ఎందరోస్త్రీలు మాతృత్వం కోసంలక్షలుఖర్చు చేసినా ప్రయోజనంఉండటంలేదు. నీమంచికోరిచెపుతున్నా,ఇంకా ఆలస్యంచేస్తేపిల్లలుపుట్టడంకష్టంఅవుతుంది” అంటున్నతల్లిమాటలుకు శ్రీనిధి”అమ్మా, నావద్ద పిల్లల ప్రస్తావన ఎత్తవద్దని ఎన్నిసార్లు చెప్పాను. మాటిమాటికి ఆ విషయం గురించి నువ్వు వర్ణించినానా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు” అంటూ తల్లి ఏమి అంటుందో కూడా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది.
శ్రీనిధితల్లితండ్రులకు ఒక్కగానొక్కకూతురు అవడంతో చాలా గారాభంగా పెరిగింది. తండ్రిది చిన్న గుమస్తా ఉద్యోగం అయినా శక్తికి మించి మంచి కాలేజిలో ఇంజనీరింగ్ చదివించి, మాస్టర్ చెయ్యడానికి అమెరికా కూడా పంపించారు.శ్రీనిధి ఇండియాతిరిగివచ్చిమంచిఉద్యోగంసంపాదించుకుని, తనతోపాటుపనిచేస్తున్న శ్రీకర్ అనే అబ్బాయినిపెళ్లిచేసుకుంటానంటేఒప్పుకునిచాలాఘనంగాపెళ్ళిచేశారు. శ్రీనిధికి పెళ్లియ్యి ఎనిమిది ఏళ్లు అయినా పిల్లలు లేరు.అయ్యో!మళ్లీ మీరు వారికి ఏదో లోపం వల్ల పిల్లలు కలగలేదు అనుకోకండి. వీరు పెళ్లియిన రోజే ఈ కాలం యువతఅనుసరిస్తున్న డింక్ ‘డబల్ ఇనకమ్ నో కిడ్స్’జీవనశైలిని పాటీస్తూ పిల్లలను కనద్దు అనినిశ్చయించుకున్నారు.తల్లిదండ్రులకు కూడా అదే చెప్పి, వారు ఏమి అనే లోపే, పిల్లలు వల్ల ఎన్నో సమస్యలు ఎదురుకొవాలని, పిల్లలు వారి స్వేచ్ఛకు, సరదాలకూఅడ్డని, భాద్యతలు పెరిగితే ఉద్యోగంలోకూడారానించలేరని చెప్పి ఎప్పుడు పిల్లల ప్రస్తావన ఎత్తదని కఛితంగా చెప్పేసారు.

మొదట్లోశ్రీనిధి తల్లి కొన్నాళ్ళకి వారే నిర్ణయం మార్చుకుంటారు అనుకుంది, కానీ ఇన్నాళ్లకు కూడా వారి నిర్ణయం మారకపోవడంతో ఆమె తల్లి మనసు తట్టుకోలేక శ్రీనిధితో తరుచుగా ఈ విషయం ఎత్తితే చాలు ఆమె కోపంగా ఫోన్ పెట్టేసేది, ఇవాళ కూడా అదే జరిగింది.
శ్రీనిధి రెండు రోజులు సెలవు తీసుకుని తల్లిదండ్రులను చూసి వద్దాం అనుకుంది. ఆనాడే ప్రయాణం, కానీ పొద్దున్న తల్లితో జరిగిన గొడవతో ఆమె టికెట్ కాన్సెల్ చేసుకుని, ప్రయాణం మానుకుందాం అనుకుంది. కానీ వెంటనే ఆమెకు కష్టపడి పెంచిన తండ్రి ముఖం గుర్తొచ్చి, బాగ్ లో రెండు బట్టలు వేసుకుని స్టేషన్ కి బయలుదేరింది.
ఆప్పటికే స్టేషన్ చేరడానికి ఆలస్యం అవడంతో ట్రైన్ ప్లాట్ఫాంపై సిద్ధంగా ఉంది. ట్రైన్ ఎక్కి బెర్త్ క్రింద బ్యాగ్ పెట్టుకుని కిటికీకి తల ఆనించి కళ్లు మూసుకుంది శ్రీనిధి. ఆలోచనలో ఉన్న ఆమెకు చంటిపాప ఏడుపు వినిపించింది. ఆమె దృష్టి ఎదురుగా ఉన్న బెర్త్ వైపు మరలింది. సుమారు తన వయసు ఉన్న ఒక ఆమె చిన్న పాపను అడిస్తూకనపడింది, ఆమె పక్కనే నడివయసు సుమారు యాభై ఏళ్లు ఉంటాయి, బహుశా యువతి తల్లి అవచ్చు అనుకుంది శ్రీనిధి.ఆ యువతి ఓ వైపు ఆఫీస్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ కు సమాధానమిస్తూ మరోవైపు పసిపాపను చూసుకుంటోంది. పక్కనే ఉన్న తల్లి పాపను ఇమ్మన్నా వారించి “అమ్మా, రేపటినుండి నేను ఆఫీస్కు వెళ్తేచిన్నిని నువ్వే చూసుకోవాలిగా.దానితో ఉన్నపుడు అయినా నేనుదానిని చూసుకుంటానమ్మా”,అన్న ఆమె మాటకి శ్రీనిధి ఆయువతిని పరిశీలనగా చూసింది. ఆమె వేసుకున్న బట్టలు, పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ అన్నీ అతి సాధారణంగా ఉన్నాయి, కానీ ఆమెలో ఆత్మవిశ్వాసం, వినయంశ్రీనిధిని ఆకట్టుకున్నాయి.
ఆమెతో ఎలాగైనా పరిచయం చేసుకోవాలన్న కోరికతో శ్రీనిధి మోహమాటంగానే వారితో మాట కలిపి తనను పరిచయం చేసుకుని వారి ఎక్కడివరకు వేళ్లుతున్నరని అడగడం తో ఆ పెద్ద ఆమె “అమ్మా, నా పేరు వసుంధర, ఇమే నా కూతురు ధరణి, ఇది నా మానవరాలు చిన్ని. మేము ఆనకాపళ్లీ వేళ్లుతున్నం” అనడం తో శ్రీనిధి “ ఆవునా, మా విశాఖపటనం కి దగ్గరే. అనకాపల్లి లో మా పెద్ద మావయ్య కొన్నాళ్ళు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేసెవారు. చిన్నప్పుడు రెండు ముడు సార్లు వేసవి సెలవులో అమ్మ తో పాటు అక్కడికి వెళ్ళాను. మావయ్య మా అందరిని నూకాంబికఅమ్మవారి గుడి కి, బొజ్జన్నకొండ, లింగాలకొండ లో బౌద్ధ మూలానికి చెందిన రాతి గుహలను చూపించడానికి కుడా తీసకేళ్ళెవాడు. అమ్మ అక్కడ బేల్లం బాగుంటుందని రెండు-ముడు కేజీలు కొని తెచ్చేది. మీరు ఎన్నాళ్ళుగా ఉంటున్నారు అక్కడ?” అని అడిగింది శ్రీనిధి. దానికి వసుంధర గారు “ధరణి కి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పోస్టీంగ అయి ముడు ఏళ్లు అయిది. నేను ఆమెకు సహయంగా మధ్య మధ్య లో వచ్చి పోతుంటాను. పాప పుట్టేకాఆరు నెలలు మెటర్నిటీ లీవ్ లో ఉంది. రేపటినుండి తిరిగి జాయిన్ ఆవుతుంది ” అంటూ గర్వంగా చెప్పడంతోధరణి వేపు ఆసక్తిగా చూస్తున్న శ్రీనిధితో వసుంధర గారు“అది నా కూతురు అని గొప్ప చెపుకొవడం కాదు కానీ ధరణి ఆ జిల్లాని, అక్కడ ఉన్న ప్రజలను చాలా సమర్థవంతంగా చూసుకుంటుంది. అందుకె ఆమెకు ఈ మధ్యేరాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డుతో సత్కరించింది”అంటున్న తల్లి మాటలకి ధరణి సిగ్గుపడుతూ “ఆదేమి లేదండీ నాఉద్యోగ ధర్మం సాయశక్తులా నిర్వర్తిస్తాను అంతే” అంది నిరాడంబరంగా.
అంత నిగర్వంగా ఉన్న ధరణి ని చూసి ‘అందుకేమన పెద్దలు నిండుకుండ తొణకదు అంటారు’అనుకుంది శ్రీనిధి.అంతదగ్గర నుండి ఎప్పుడూ ఒక కలెక్టర్ ని చూడని శ్రీనిధికి ఆమె గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలంతో “ధరణి గారు, మీరు ఏమి అనుకోనంటే ఒక మాట అడగనా?” అండంతో ధరణి అంగికారంగా తలఉపింది. “నఇన్ టు ఫైవ్జాబ్ చేస్తున్న నాకే ఇల్లు ఆఫీసు రెండు చూసుకోవడం చాలా కష్టంగావుంది,అలాంటిది మీరు ఇంత చిన్న వయసులో రాత్రి పగలు ఆనక ఒక జిల్లాకలెక్టర్ గా, గృహిణిగా, తల్లిగాఇన్ని బాధ్యతలు ఇంత సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తున్నారు. పాప పుట్టేముందు మీకు ఆమెను సరిగా పెంచగలనా లేదా అన్న సందేహం రాలేదా?” అంది శ్రీనిధి కుతూహలంగా.
దానికి ధరణి నవ్వి, “శ్రీనిధి గారు, నాకు పెళ్లికి ముందు అలాగే పాప పుట్టేముందు కూడా యిన్ని బాధ్యతలుసవ్యయం గా చెయ్యగలనా అన్న భయం మనసులో ఉండేది కానీ ఏ కొత్త బాధ్యత అయినా, పని అయినా చేయడానికి ముందు భయం ఉండడం సహజమే కదా. నన్ను అర్థం చేసుకుని నాకు తోడు నీడగా ఉండే భార్త ,ఆన్ని విధాలగా సాయపడే కుటుంబం తోడు ఉంటే ఇక బెంగ ఎందుకు అని ముందడుగు వేసాను. నాకు సాయంగా ఇప్పుడు అమ్మ వస్తే, మరి కొన్నేళ్లకి అత్తయ్య వచ్చి నాకు సాయంగా ఉంటారు. నాకు ఎప్పుడు “అమ్మా” అన్న పిలుపు వినాలన్న కోరిక ఉండేది. చిన్ని నా జీవితం లోకి రావడం తో నా కోరిక నేరవేరింది. నేను బాధ్యతలకు భయపడి, స్వేచ్ఛ కోల్పోతానని అనుకుంటే ఈ అమ్మాతం లో ఉన్న తియ్యదన్నాని కొలిపోయివుండేదానిని. ఇప్పుడు చిన్నేనా లోకం, దాని పనులన్నీ నేనే స్వయంగా చేసి మాతృత్వంలో ఉన్న మధురానుభూతిని ఆస్వాదిస్తున్నాను. అన్నట్టు శ్రీనిధిగారు, మిమ్మలని నా మాటలతో విసగిస్తున్నానా?”అనడంతో శ్రీనిధి, “లేదండి, మీరు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంది” అంటూ మనసులో ‘అమ్మ కూడా ఎప్పుడు ఇలాగే చెపతువుంటుంది కాని నేనే ఆమె మాటను పట్టించుకోలేదు’ అనుకుంది బాధగా.
తెల్లవారుతూనే వారి స్టేషన్ రావడంతో ధరణి, వసుంధర పాపను ఎత్తుకుని శ్రీనిధికి బై చెప్పి భోగీదిగగానే చాలామంది ధరణిని పూలగుత్తులతో, దండలతో స్వాగతించారు. అది చూసిన శ్రీనిధి మనసులో, సమాజంలో ఇంకా చాలామంది స్త్రీలు ధరణిలాగేనే ఎదగాలని కోరుకుంది. ట్రైన్ వేగం అందుకుంది, శ్రీనిధి మనసూ కూడా ధరణి అన్న మాటకి ఆమె ఇన్నాళ్ళుగా చేస్తున్న తప్పు తెలుసుకుని పాశ్చతాపంతో కుమిలిపోయింది. ఇన్నాళ్లు మాతృత్వానికి దూరంగా ఉండి ఎంత విలువైన అనుభూతిని కోల్పోయిందో అర్థమై, అది ఆస్వాదించాలన్న కోరిక బలపడింది.
ఈ సంఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. శ్రీనిధి ఇల్లు బంధుమిత్రులతో సందడిగా ఉంది. శ్రీకర్,శ్రీనిధి చంటి పాపనుఒడిలోపెట్టుకుని బారసాల పీటలపై కూర్చున్నారు. పురోహితుడు పూజ చేయించి, పాప పేరు బియ్యంలో రాయమనడంతో శ్రీనిధి శ్రీకర్ చెవిలో పాప పేరు చెప్పిది. ఆయన పసుపుకొమ్ముతో బియ్యంపై ‘ధరణి’ అని రాశాడు. పాప పేరును చూసిన శ్రీనిధి సంతోషంతో“నా చిట్టితల్లి,ధరణి”అంటూ ముద్దు పెట్టుకుని మురిసిపోయింది.
శ్రీనిధికి ధరణి అన్నది ఒక పేరు మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని ఒక అందమైన మలుపు తిప్పిన పేరు. ఒడిలో ఉన్న పాపను చూస్తున్న ఆమెకు ట్రైన్ లో కలిసిన కలెక్టర్ ధరణి లాగె ఆమె పాపకికుడా అంత గొప్ప వ్యక్తిత్వం కలగాలని దేముడిని కోరుకుంది.
***