ముద్దుఫళని

తెలుగు సాహిత్య చరిత్రలో కొన్ని పేర్లు కాలం గడిచేకొద్దీ మరుగునపడిపోయినా, తిరిగి వెలుగులోకి వచ్చినప్పుడు తమ కాలాన్నే కొత్తగా అర్థం చేసుకునేలా చేస్తాయి. అలాంటి అరుదైన పేర్లలోముద్దుఫళనిఒకరు.

ఆమె తంజావూరు రాజసభలో వికసించిన తెలుగు సాహిత్య, సంగీత, నాట్య సంస్కృతికి ప్రతినిధి. అంతేకాదు, స్త్రీ తన కోరికలను, తన అనుభూతులను, తన అసూయను, తన బాధను తానే వ్యక్తపరచగలదని సాహిత్యం ద్వారా చూపించిన ధైర్యవంతురాలైన రచయిత్రి.

నాయక రాజుల కాలంలో మధుర తంజావూరులో ఉన్న సంసృత, తెలుగు కవులు గురించి 1975 సంవత్సరంలో జరిగిన మొదటి తెలుగు మహా సభల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిచే, తిమ్మావజ్జల కోదండ రామయ్య గారు రచించిన పుస్తకాన్ని అవిష్కరించారు. అందులో వివరించిన మన మహిళా సాహిత్యకారులైన ఆనాటి కావ్య నాయికలే రామభద్రాంబ, మధురవాణి, రంగరాజమ్మ, ముద్దుఫళని.

 

తంజావూర్ రాజసభ సాంస్కృతిక నేపథ్యం.ఆ కాలంలో తంజావూర్ ఒక గొప్ప సాహిత్య, సంగీత, నాట్య కేంద్రం. తరువాత మరాఠా పాలకులు ఆ సాంస్కృతిక సంప్రదాయాలను పూర్తిగా తొలగించకుండా, వాటిలో అనేక అంశాలను కొనసాగించారు. తంజావూరు రాజసభల్లో తెలుగు, సంస్కృతం, తమిళం వంటి భాషలకు, సంగీత నాట్యాలకి విశేషమైన ఆదరణ లభించింది. ఈ నేపథ్యమే ముద్దుఫళని వంటి కళాకారిణులకు విద్య, సాహిత్యం, సంగీతం, నాట్యం వంటి రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించింది.

రాజసభలో నాట్యకళాకారులు, సంగీత విద్వాంసులు, కవులు ఉండేవారు. ముద్దుఫళని కూడా అలాంటి రాజసభలో భాగమైనదేవదాసి సంప్రదాయానికి చెందినవారిగా భావిస్తారు.

దేవదాసీలు కళలో ప్రావీణ్యం కలిగినవారు. వారు సంగీతం, నాట్యం, సాహిత్యంలో నిపుణులు. సమాజంలో వారికి ఒక ప్రత్యేకమైన కానీ సంక్లిష్టమైన స్థానం ఉండేది.భక్తి, శృంగారం కలిసిన కళాసంప్రదాయం. దేవదాసి వ్యవస్థలో కళాకారిణులు రాజసభలో ప్రాధాన్యం పొందేవారు. ముద్దుఫళని కూడా ఈ వ్యవస్థలో భాగం కావడం వల్ల ఆమెకు విద్య, కళ, సాహిత్యంపై పూర్తి పట్టు వచ్చింది. శృంగారం గురించి ఆమెకు ఉన్న అవగాహన సహజంగా ప్రతిఫలించింది. ముద్దుఫళని పద్యాలు సున్నితమైనవి. శృంగారభరితమైనవి. స్త్రీ భావజాలాన్ని లోతుగా తాకేవి.

ముద్దుఫళని 18వ శతాబ్దంలో తంజావూర్ ప్రాంతంలో జీవించిన ప్రముఖ తెలుగు కవయిత్రి. ఆమె తంజావూర్ నాయకుల తరువాత రాజ్యాన్ని పాలించినమరాఠా రాజుల కాలంలోజీవించింది. తంజావూర్ మరాఠా రాజసభలో ఆమెకు ఉన్న స్థానం వల్ల, ఆమె సాహిత్యం ఒకరాజసభీయ శృంగార సాహిత్య సంప్రదాయంకి చెందినది.

ముద్దుఫళనిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆమెజీవించి  తంజావూరును అర్థం చేసుకోవాలి.ఆమె జీవించిన కాలం తంజావూరును పాలించిన మరాఠా రాజుప్రతాపసింహుడు (1739–1763)కాలంతో ముడిపడి ఉంది. పరిశోధనా వనరులు ముద్దుఫళని ప్రతాపసింహుని రాజసభతో అనుబంధం కలిగిన గణిక/దేవదాసి సంప్రదాయానికి చెందిన కవయిత్రిగా పేర్కొంటున్నాయి. 

ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. అప్పటి‘గణిక’, ‘దేవదాసి’, ‘కళావంతురాలు’అనే సామాజిక పదాలకు నేటి ‘వేశ్య’ అనే ఒక్క పదంతో సమానార్థం ఇవ్వడం చారిత్రకంగా సరైనది కాదు. ఆ వర్గంలోని కొందరు మహిళలు సంగీతం, నాట్యం, సాహిత్యం, సంస్కృతం, తెలుగు వంటి విద్యల్లో ఉన్నతమైన శిక్షణ పొందారు. రాజసభలు, దేవాలయాలు, కళా వర్గాలతో వారి సంబంధాలు సంక్లిష్టమైనవి.

ముద్దుఫళని గురించి మనకు లభించే వ్యక్తిగత జీవిత సమాచారం చాలా తక్కువ. అందువల్ల ఆమె జీవిత చరిత్రను పూర్తిగా నిర్మించడానికి ప్రయత్నించడం కంటే, ఆమె రచనల ద్వారా కనిపించే వ్యక్తిత్వాన్ని పరిశీలించడం మరింత విశ్వసనీయమైన పద్ధతి.

ఆమె తెలుగు, సంస్కృత సాహిత్యంలో పాండిత్యం కలిగినవారిగా, సంగీత నాట్యాల్లో ప్రావీణ్యం పొందినవారిగా ఆధారాలు పేర్కొంటాయి. ఆమె దేవదాసి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినట్లు ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. ఆమె కుటుంబ వారసత్వంలో సంగీతం, నాట్యం, సాహిత్యం ఉన్నాయని కూడా పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆమె అమ్మమ్మతంజనాయకిసంగీతం, నవరసాల ప్రదర్శనలో ప్రతిభ కలిగిన కళాకారిణిగా ప్రస్తావించబడుతుంది. అందువల్ల ముద్దుఫళని ఒక వ్యక్తిగత ప్రతిభతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కవయిత్రి కాదు. ఆమె వెనుకతరతరాలుగా వచ్చిన ఒక కళా సంప్రదాయంఉంది.ముఖ్యంగా తంజావూర్ కి చెందిన ప్రతాప్ సింగ్రాజు సమయానికి ఆమె రాజసభలో గౌరవ స్థానం పొందింది.

1739-1763ప్రతాప్ సింగ్ రాజుఅంతఃపురంలో ఒక వేశ్య కుమార్తె. తంజావూరులోని భోంస్లే పాలకులు నాయకుల సాహిత్య, సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించారు, వారిని వారు భర్తీ చేశారు. తంజావూరు ఆస్థానంలో ఉన్న చాలా మంది వేశ్యల వలె, ఆమె ఉన్నత విద్యావంతురాలు, సంస్కృతం, తెలుగు భాషలలో ప్రావీణ్యంసంపాదించింది. తెలుగుపై ఆమెకున్న పట్టు ప్రశంసనీయం. ఆమె నృత్యం, సంగీతంలో నిపుణురాలు. వీణపై ఆమె నైపుణ్యం ఆమె సమకాలీనుల ప్రశంసలను గెలుచుకుంది. ముద్దుపళని, అన్నింటికంటే మించి, గొప్ప సాహిత్య యోగ్యత కలిగిన కవయిత్రి, ఆమె రచనలు ఇప్పటికీ ప్రజాదరణ పొందాయి.

తంజావూర్ ముద్దుఫళనితెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేకమైన, ధైర్యవంతమైన స్త్రీ కవయిత్రి. ఆమె గురించి పూర్తి వివరంగా తెలుసుకుంటే, ఆమె జీవితం, కాలం, రచనలుకలిపి ఒక ఆసక్తికరమైన సాంస్కృతిక ప్రపంచాన్ని చూపిస్తాయి.ప్రధానంగా ఆమె రెండు రచనల రచయిత్రి. అత్యంత ప్రసిద్ధ గ్రంథం“రాధికా సాంత్వనం” లేదా ఇలావిద్య.ఇది ఒక శృంగార కవ్యం. కథలో ప్రధాన పాత్రలు రాధ, కృష్ణా, ఇలాగే ఇలావరసి (ఇలా అనే పాత్ర కూడా ఉంది).

ఇది తెలుగు శృంగార ప్రబంధ సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన కృతి. ఆధునిక పరిశోధనల ప్రకారం ఇందులో584 పద్యాలు, నాలుగు విభాగాలు ఉన్నాయి. కథకురాధ, కృష్ణుల ప్రేమ నేపథ్యం ఉన్నప్పటికీ, ముద్దుఫళని దానిని సాధారణ రాధాకృష్ణ భక్తి కథగా చెప్పలేదు. ఆమె కథలో రాధ, కృష్ణుడు, ఇల ప్రధాన పాత్రలు.

ఇక్కడ ఇల కృష్ణుని కొత్త భార్య. రాధ ఆమెకు కేవలం బంధువు మాత్రమే కాదు. ప్రేమను, దాంపత్యాన్ని అర్థం చేసుకునేలా మార్గనిర్దేశం చేసే స్త్రీ.ఇదే ముద్దుఫళని రచనలో అత్యంత అసాధారణమైన అంశాలలో ఒకటి.రాధకు కృష్ణునితో అనుభవం ఉంది. ఇల మాత్రం కొత్త వధువు.కాబట్టి ఇల కృష్ణునితో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టే ముందు రాధ ఆమెకు ప్రేమలోనిసున్నితత్వాన్ని, కొత్త అనుభవం పట్ల భయాన్ని ఎలా అధిగమించాలో చెబుతుంది.సాధారణ సాహిత్యంలో పురుషుడు స్త్రీకి ప్రేమను నేర్పుతాడు. కానీ ముద్దుఫళని కథలోఒక స్త్రీ మరో స్త్రీకి ప్రేమ గురించి చెబుతుంది.

రాధ గురువు పాత్రలో తన స్నేహితురాలు ఇలాకు కృష్ణునితో ప్రేమ, సంభోగం గురించి తెలియచేస్తుంది. ప్రేమ, శృంగారం ఎలా అనుభవించాలో నేర్పుతుంది. చాలా అసాధారణమైన దృశ్యం. ఇది కేవలం శృంగార వర్ణన కాదు. ఇందులో స్త్రీ అనుభవం స్త్రీ నుంచే స్త్రీకి బదిలీ అవుతుంది.ఇక్కడే ముద్దుఫళని రచన కేవలం శృంగార కథగా మిగలదు.

స్త్రీ కోరికను అత్యంత స్పష్టంగా పలికించిన పద్యం. రాధికా సాంత్వనంద్వితీయాశ్వాసంలోని ప్రసిద్ధ పద్యం ఇది:

కనుగవ హరిమోము గనుగొననే కోరువీనులు హరిమాట వినగ గోరు

నాసిక హరిమేని వాసనల్గొన గోరునధరంబు హరిమోవి యాన గోరు

జెక్కిలి హరిగోటినొక్కు టెక్కులె కోరుగుబ్బలు హరిఱొమ్ము గ్రుమ్మ గోరు

గరములు హరి నెంతో కౌగలింపగ గోరుమేను శ్రీహరిప్రక్క మెలగ గోరు

నిన్ని యొక్కటే కోరు నిదిగొ నాదుమనసు గోరెడికోరికెల్‌ మట్టులేవు…

ఇదిరాధికా సాంత్వనంలో 2.62గా ఉదహరించబడిన పద్యం. 

భావం:
కళ్లకు కృష్ణుని ముఖాన్ని చూడాలని ఉంది. చెవులకు ఆయన మాట వినాలని ఉంది. ముక్కుకు ఆయన దేహ పరిమళాన్ని ఆస్వాదించాలని ఉంది. పెదవులకు ఆయన ముద్దు కావాలి. చేతులు ఆయనను కౌగిలించుకోవాలని కోరుతున్నాయి. చివరికి“నా మనసుకు కావలసిన కోరికలకు అంతులేదు”అని స్త్రీ తన కోరికను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తం చేస్తుంది.

కృష్ణుణ్ని చూడాలని, వినాలని, తాకాలని, కౌగిలించుకోవాలని తన శరీరంలోని ప్రతి ఇంద్రియం కోరుకుంటోందని ముద్దుఫళని నేరుగా పలికించింది. తెలుగు శృంగార సాహిత్యంలో పురుషుని దృష్టి నుంచి స్త్రీని వర్ణించడం సాధారణమైనప్పటికీ, ఇక్కడ స్త్రీ తన కోరికను తానే పలుకుతోంది. ఇదే ముద్దుఫళని కవిత్వంలోని అసాధారణమైన ధైర్యం.

ఈ పద్యం ఎందుకు ముఖ్యమైనది?

ఇక్కడ ముఖ్యమైనది శృంగార వర్ణన మాత్రమే కాదు.కోరేది పురుషుడు కాదు,  స్త్రీ. తన కోరికను చెప్పేది కూడా పురుష కవి కాదు, స్త్రీ కవయిత్రి.అందుకే ఈ పద్యం ముద్దుఫళని సాహిత్య ధైర్యానికి మంచి ఉదాహరణ.

రాధ యొక్క ప్రేమ, ఆకాంక్షను చూపించే పద్యం.

నాకృష్ణ దేవుని నా ముద్దుసామినినా చక్కనయ్యను నాదుహరినినానోముపంటను నారాజతిలకుని

నారాముతమ్ముని నాదువిభునినామనకాంతుని నానందతనయునినా ప్రాణనాథుని నాదుప్రియుని

నామోహనాంగుని నానీలవర్ణునినావిటోత్తంసుని నాది సఖుని…

ఇది కూడారాధికా సాంత్వనం2.72గా ఉదహరించబడింది. 

ఇక్కడ రాధ కృష్ణుణ్ని వరుసగా అనేక ఆప్యాయమైన పేర్లతో పిలుస్తుంది.“నా”అనే పదం పదేపదే రావడం గమనించదగినది. అది కేవలం ప్రేమ కాదు.తనకు అతను ఎంత వ్యక్తిగతమైనవాడో, తన మనసులో అతనికి ఉన్న స్వాధీనత భావాన్నికూడా తెలియజేస్తుంది.

ఇల కృష్ణుని భార్య అవుతుంది.రాధ స్వయంగా ఆమెకు ప్రేమను అర్థం చేసుకునేలా చేసింది. కానీ ఇప్పుడు ఇల కృష్ణునికి దగ్గరవటం రాధలోఅసూయ, బాధ, కోల్పోయిన భావన, స్వాధీనత, ప్రేమఅన్నీ ఏర్పడతాయి.ముద్దుఫళని రచనలో అత్యంత ముఖ్యమైన మనోవైజ్ఞానిక కోణం.రాధ కేవలం కృష్ణుడి కోసం ఏడ్చే భక్తురాలు కాదు.ఆమెకు కోరిక ఉంది.ఆమెకు అసూయ ఉంది.తాను ప్రేమించిన వ్యక్తిని మరొక స్త్రీతో పంచుకోవడం ఆమెకు బాధ కలిగిస్తుంది.తాను నేర్పిన ప్రేమను మరొక స్త్రీ అనుభవిస్తుండటమే ఆమెకు అంతర్గతంగా గాయం చేస్తుంది.

చివరికి కృష్ణుడు రాధను సమాధానపరచడం వల్లే ఈ కృతికి‘రాధికా సాంత్వనం’  రాధను ఓదార్చడంఅనే పేరు వచ్చింది. ఆధునిక పరిశోధనలు కూడా కృతిలో రాధ అనుభవించే అసూయ, బాధ, ఆ తరువాత ఆమెకు లభించే సాంత్వనను ప్రధాన నిర్మాణంగా గుర్తిస్తున్నాయి. 

చక్కనిదాన వంచు రతిసార మెఱింగినదాన వంచు నాయక్కఱ దీర్తు వంచు నను హాయిగఁ గౌఁగిటఁ జేర్తు వంచు నేనిక్కము నమ్మి వచ్చునెడ నీ విపు డీమటుమాయలాండ్రచేనక్కట యెప్పగించి యిటు లారడి సేతురె రాధికామణీ.— చతుర్థాశ్వాసము, పద్యం 26 

ఇందులో కృష్ణుడు తనను నమ్మి తన దగ్గరకు వచ్చిన రాధను మళ్లీ తనతో చేర్చుకోవాలని కోరుతున్నాడు.అందులో ముఖ్యంగా కృష్ణుడు రాధను తనతో మళ్లీ కలవమని వేడుకునే ఈ పద్యం చాలా అందంగా ఉంటుంది.

ననుఁ కరుణించవే పిలువ నంపవె కౌఁగిట గారవించవేఘనత ఘటించవే చెలిమి గాంచెవె నాపలు కాదరించవేనెనరు గణించవే ముదము నించవె యెంచవె యేల నాపయింగినుక నడంపవే తెలియ కే నిను వేడెద రాధికామణీ.— రాధికా సాంత్వనం, చతుర్థాశ్వాసము, పద్యం 25 

సరళమైన భావం

“రాధా! నాపై దయ చూపవా? నన్ను పిలిచి నీ దగ్గరకు రానివ్వవా? నన్ను నీ కౌగిలిలోకి తీసుకుని ఆదరించవా? మన మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేసుకోలేవా? నా మాటలను ఆలకించి, నా మీద కోపాన్ని విడిచిపెట్టవా? నీ మనసులోని అలకను తొలగించవా? నిన్ను ఎలా వేడుకోవాలో కూడా నాకు తెలియడం లేదు.”

ఇది చాలా మంచిసాంత్వన పద్యం. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు తన ప్రేమను ప్రకటించడం కంటేరాధ కోపాన్ని, బాధను తగ్గించడానికి ఆమెను వేడుకుంటున్నాడు. రాధను బాధపెట్టిన కృష్ణుడే చివరికి ఆమెను ఓదార్చడానికి ఆమె ముందుకు వస్తాడు. “నన్ను కరుణించవా? నన్ను కౌగిలిలోకి తీసుకోవా? మన ప్రేమను గుర్తు చేసుకోవా?” అంటూ కృష్ణుడు రాధను వేడుకునే ఈ పద్యంలో ప్రేమికుడి ఆవేదన కనిపిస్తుంది. కానీ అంతకంటే ముఖ్యంగా, రాధ కోపానికి విలువనిచ్చి, ఆమెను ఒప్పించవలసిన అవసరాన్ని కృష్ణుడికే కల్పించడం ముద్దుఫళని సృష్టించిన స్త్రీ పాత్ర యొక్క భావోద్వేగ బలాన్ని తెలియజేస్తుంది.

ఇది“రాధ — కేవలం కృష్ణుడి ప్రేయసి కాదు. తన కోపానికీ, తన బాధకీ విలువ ఉన్న స్త్రీ”అనే విశ్లేషణకు చాలా బలమైన ఉదాహరణ అవుతుంది. 

రాధిక, కృష్ణ ప్రేమలను వర్ణించే శృంగార పద్యం, అసాధారణమైన సాహిత్య శ్రేష్టమైన రచన. ఆమె కవిత్వ ధోరిణి, చిత్రణ చక్కగా ఉన్నాయని, ఆమె వివరణలు మనోహరంగానూ, శైలి సరళమైనది, గృహబద్ధమైనది, మనోహరమైనదని శ్లాఘించబడింది.

ఈ కృతి ప్రత్యేకంగా చెబుతారు. ఇందులో ఆమె స్త్రీ దృష్టికోణం.శృంగారాన్ని ఒక స్త్రీ కోణంలో నుంచి చాలా స్పష్టంగా, నిర్భయంగా వర్ణించింది. ఇది ఆ కాలంలో చాలా అరుదైన విషయం.సాహసోపేతమైన భాష. ఆమె వాడిన పదజాలం, భావాలను చాలా బహిరంగంగా వ్యక్తీకరిస్తుంది. ముద్దుఫళని శృంగారాన్ని వర్ణించడం ఒక్కటే ఆమె ప్రత్యేకత కాదు.స్త్రీని శృంగార అనుభవానికి సంబంధించిన వస్తువుగా కాకుండా, అనుభవించే వ్యక్తిగా చూపించడంఆమె రచనలోని ముఖ్యమైన లక్షణం.స్త్రీ స్వరాన్ని వినిపించడం. మహిళా ఆకాంక్షలు, కోరికలు, భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తం చేసింది. అందుకే ఈ కృతిని కొంతమంది విమర్శించారు.

ఆమె స్త్రీకికోరిక, సంకోచం, ఆసక్తి, అనుభవం, అసూయ, కోపం, బాధ, తనకు నచ్చిన వ్యక్తిని కోరుకునే హక్కు ఉంది.ఈ భావాలన్నింటినీ ఆమె స్త్రీ పాత్రల ద్వారా వ్యక్తం చేసింది.అందుకే ఆధునిక పాఠకుడికి ముద్దుఫళని రచనలో అత్యంత ముఖ్యమైన అంశం కేవలం శృంగారం కాదు.స్త్రీ అనుభవానికి ఇచ్చిన స్వరం.

ఆమెను ‘తొలి స్త్రీవాద కవయిత్రి’ అనవచ్చా?

ఇక్కడ కొంత జాగ్రత్త అవసరం.ముద్దుఫళని 18వ శతాబ్దానికి చెందినది.‘ఫెమినిజం’ అనే ఆధునిక రాజకీయ, సామాజిక సిద్ధాంతాన్ని ఆమెకు నేరుగా ఆపాదించడం చారిత్రకంగా సరైనది కాదు.అయితే ఆధునిక స్త్రీవాద విమర్శ ఆమె రచనలోని కొన్ని అంశాలను స్త్రీ స్వాతంత్ర్యం, స్త్రీ కోరిక, స్త్రీ శరీరానుభవం, స్త్రీ స్వరం వంటి భావాలతో అనుసంధానిస్తుంది.అందువల్ల“ముద్దుఫళని తొలి ఫెమినిస్ట్”అని ఖచ్చితమైన చారిత్రక బిరుదుగా చెప్పడం కంటే,“ఆధునిక స్త్రీవాద దృష్టిలో ముందుగానే చదవదగిన శక్తివంతమైన స్త్రీ స్వరం”అని చెప్పడం మరింత సముచితం.

ముద్దుఫళనికి ఆపాదించబడే మరో ముఖ్యమైన రచన‘అష్టపది’. ఇది జయదేవునిగీతగోవిందంలోని అష్టపదుల తెలుగు రూపాంతరంతో సంబంధం కలిగి ఉంది. ఆమె ఆండాళ్తిరుప్పావైను కూడా అనువదించినట్లు ఆధారాలు పేర్కొంటున్నాయి. సప్తపదులు అనే రూపంలో రచనా ప్రయోగాలు చేసినట్లు కూడా సూచనలు ఉన్నాయి. రచయిత గొప్ప సంగీత ప్రతిభ గురించి మనకు అంతర్దృష్టిని అందించే మూలానికి అనువాదం విలువైనదని సమర్థ సంగీత విమర్శకులు అభిప్రాయపడ్డారు.

దీనివల్ల ముద్దుఫళనిని కేవలం శృంగార రచయిత్రిగా చూడటం ఎంత పరిమితమైనదో తెలుస్తుంది.ఆమెకు భక్తి, సంగీతం, కవిత్వం, శృంగారం ఇవన్నీ పరస్పరం విరుద్ధమైన రంగాలు కావు.తంజావూరు కళాసంప్రదాయంలో ఇవన్నీ ఒకదానితో ఒకటి మిళితమై ఉన్నాయి.

అసలు వివాదం ఎప్పుడు మొదలైంది?

ముద్దుఫళని జీవించిన కాలంలో ఆమె రచనపై మనకు కనిపించే పెద్ద ప్రజా వివాదం లేదు.అది19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ప్రారంభంలోఉధృతమైంది.1855లో తెలుగు పండితుడుసి. పి. బ్రౌన్ముద్దుఫళని రచనకు సంబంధించిన ఒక సిద్ధప్రతిని పొందినట్లు తరువాతి ప్రచురణ చరిత్ర చెబుతుంది. 1887లో పైడిపాటి వెంకటనరసు ఆధ్వర్యంలో ముద్రిత రూపం వచ్చింది. 1907లో మరో ముద్రణ వెలువడింది. అయితే ఆ సంచికల్లో కొన్ని శృంగార పద్యాలు, అలాగే ముద్దుఫళని తన వంశపారంపర్యాన్ని వివరించిన ముందుమాటలోని భాగాలు తొలగించబడ్డాయి. 

ముద్దుఫళని రచనపై కాలక్రమంలో చాలా వివాదాలు వచ్చాయి. బ్రిటిష్ కాలంలో ఈ గ్రంథాన్నిఅశ్లీలంగా భావించి నిషేధించారు.సామాజిక నైతిక విలువలకు విరుద్ధంగా చూశారు.తరువాతబెంగుళూరు నాగరత్నమ్మ అనే ప్రముఖ సాహిత్యాభిమాని ఈ గ్రంథాన్ని తిరిగి ప్రచురించింది.“ఇది అసభ్యకృతి కాదు. ఇది సాహిత్యం” అని రక్షించింది.ఆమె వల్ల ముద్దుఫళని కవిత్వం మళ్లీ వెలుగులోకి వచ్చింది. నాగరత్నమ్మ కూడా దేవదాసి సంప్రదాయానికి చెందిన పండితురాలు, గాయని, కళాకారిణి.

ఆమెకు లభించిన ముద్రితరాధికా సాంత్వనంఅసలు రచనతో సరిపోలడం లేదని తెలిసింది. కొన్ని పద్యాలు లేవు. ముద్దుఫళని తన వంశం గురించి చెప్పిన భాగాలు కూడా తొలగించబడ్డాయి.నాగరత్నమ్మ అసలు తాళపత్ర ప్రతిని వెతికి, దాని ఆధారంగా1910లో పూర్తి రూపంలో రాధికా సాంత్వనాన్ని ప్రచురించింది. ఇది కేవలం ఒక పుస్తక పునర్ముద్రణ కాదు.ఒక స్త్రీ మరో స్త్రీ స్వరాన్ని తిరిగి సమాజానికి అందించిన సంఘటన.

వీరేశలింగం–నాగరత్నమ్మ వివాదం

ఈ పునర్ముద్రణ తీవ్ర చర్చకు దారితీసింది.సామాజిక సంస్కర్తకందుకూరి వీరేశలింగంముద్దుఫళని రచనలోని శృంగారాన్ని తీవ్రంగా విమర్శించాడు. ముఖ్యంగా ఒక స్త్రీ నోటి నుంచి అలాంటి వర్ణనలు రావడాన్ని ఆయన అంగీకరించలేదు. నాగరత్నమ్మ మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఆమె ప్రశ్నలో ఒక ముఖ్యమైన సాహిత్యలింగ రాజకీయ అంశం ఉంది.

పురుషుడు శృంగారం రాస్తే అది కవిత్వం. అదే స్త్రీ రాస్తే అది అసభ్యత ఎందుకు?

ఈ ప్రశ్నే తరువాత ముద్దుఫళని చుట్టూ ఏర్పడిన ఆధునిక స్త్రీవాద పఠనానికి ఒక ప్రధాన ఆధారంగా మారింది.నాగరత్నమ్మ రక్షణలో వ్యక్తిగత అనుబంధం మాత్రమే లేదు.స్త్రీ రచయిత్రికి వర్తించే ప్రమాణాలు, పురుష రచయితలకు వర్తించే ప్రమాణాలు ఒకటేనా?అనే ప్రశ్న ఉంది.

బ్రిటిష్ పాలనలో ‘అశ్లీలత’ వివాదం

1910లో నాగరత్నమ్మ ప్రచురించిన పూర్తి సంచిక తరువాత వలస పాలనా యంత్రాంగం దృష్టికి వచ్చింది.1911లోరాధికా సాంత్వనంపై అధికారిక చర్యలు జరిగాయి. కొన్ని ఆధారాల ప్రకారం ప్రచురిత ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో గ్రంథంలోని అనేక భాగాలను అభ్యంతరకరంగా పేర్కొన్నారు. అందువల్ల“బ్రిటిష్ కాలంలో ఈ గ్రంథం అశ్లీలత పేరుతో నిషేధానికి గురైంది”అని చెప్పడం సమర్థించగల చారిత్రక వాదన.

అయితే ఈ నిషేధం గురించి సంవత్సరాలు, ప్రభుత్వ ఉత్తర్వుల అమలు, తరువాతి పునర్ముద్రణల పరిస్థితి వంటి వివరాల్లో వేర్వేరు ఆధారాల్లో తేడాలు కనిపిస్తాయి.

ఒక సాహిత్య కృతిపై మూడు తీర్పులు

ముద్దుఫళని చుట్టూ ఏర్పడిన చర్చను మూడు దశల్లో చూడవచ్చు.

మొదటిది — సంప్రదాయ నైతిక దృష్టి.“ఇంత స్పష్టమైన శృంగారం సాహిత్యంలో అవసరమా?” అనే ప్రశ్న.

రెండవది — సాహిత్య స్వేచ్ఛ దృష్టి.“శృంగారం కూడా ఒక రసమే. పురుష కవులకు ఉన్న స్వేచ్ఛ స్త్రీ కవయిత్రికి ఎందుకు ఉండకూడదు?” అనే ప్రశ్న.

మూడవది — ఆధునిక స్త్రీవాద దృష్టి.“ఇక్కడ ఒక స్త్రీ తన కోరికను తానే పలుకుతోంది. తన అనుభవాన్ని తానే నిర్వచిస్తోంది. అదే అసలు ప్రాధాన్యం” అనే పఠనం.

ఈ మూడు దృష్టుల్లో ఏ ఒక్కదానితోనూ ముద్దుఫళనిని పూర్తిగా అర్థం చేసుకోలేం.ముద్దుఫళని — తనను తాను తక్కువ చేసుకోని కవయిత్రి.

ముద్దుఫళని రచనలో కనిపించే మరో విశేషం ఆమెఆత్మవిశ్వాసం.ఆమె తన ప్రతిభను దాచుకోలేదు.

తాను ఎవరో, తనకు ఉన్న పాండిత్యం ఏమిటో, తన కుటుంబ కళా సంప్రదాయం ఏమిటో చెప్పుకోవడంలో వెనుకాడలేదు.ఇది కూడా ఆమె కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యమైన విషయం.

స్త్రీ తన గురించి తానే గొప్పగా మాట్లాడటం కూడా ఒక సామాజిక అసౌకర్యానికి కారణమయ్యే కాలంలో, ముద్దుఫళని తన సాహిత్య వ్యక్తిత్వాన్ని స్వయంగా ప్రకటించింది.

అందువల్ల ఆమె రచనలోస్త్రీ కోరిక మాత్రమే కాదు, స్త్రీ రచయిత్రి యొక్క ఆత్మగౌరవం కూడా ఉంది.

ముద్దుఫళని రచనలో స్త్రీ మనస్తత్వం

ముద్దుఫళని గొప్పతనం ఆమె శృంగార వర్ణనలో మాత్రమే లేదు.రాధలోని అసూయను ఆమె ఎంత మానవీయంగా చిత్రించిందన్నదే ముఖ్యమైనది.తాను ప్రేమించిన వ్యక్తిని తానే మరో స్త్రీకి పరిచయం చేస్తుంది.ఆమెను తానే సిద్ధం చేస్తుంది.కానీ అదే స్త్రీ కృష్ణుడికి దగ్గరవుతున్నప్పుడు తనలోనే ఒక బాధ మొదలవుతుంది.

ఇది ఒక గొప్ప మానసిక వైరుధ్యం.

“నేను ఇచ్చిన ప్రేమలోనే నేను కోల్పోయిన ప్రేమను చూస్తున్నాను.”ఈ అంతర్గత సంఘర్షణను ముద్దుఫళని రాధ పాత్రలో ప్రతిష్ఠించింది.అందువల్లరాధికా సాంత్వనంను కేవలం శృంగార కావ్యంగా చదవడం దాని సగం మాత్రమే చదివినట్లవుతుంది.ఇదిప్రేమ, కోరిక, అసూయ, స్వాధీనత, బాధ, సమాధానంగురించి కూడా చెప్పే కృతి.

దేవదాసి’ అనే ముద్రతో ముద్దుఫళనిని చదవడం సరిపోదు. ముద్దుఫళనిని అర్థం చేసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇదే.ఆమెను కేవలం “దేవదాసి”గా గుర్తించి, ఆ గుర్తింపునే ఆమె సాహిత్యానికి వివరణగా ఉపయోగించడం సరైంది కాదు.ఆమె ఒకకళా సంప్రదాయంలో విద్య పొందిన మహిళ.ఆమెకు సంగీతం, నాట్యం, తెలుగు, సంస్కృత సాహిత్య పరిజ్ఞానం ఉంది.రాజసభ సంస్కృతిలో స్థానం ఉంది.అన్నింటికంటే ముఖ్యంగాకవిత్వం రాయగల సృజనాత్మక శక్తి ఉంది.ఆమె సామాజిక నేపథ్యం ఆమెను అర్థం చేసుకోవడానికి అవసరం. కానీ అదే ఆమె సాహిత్య విలువకు పరిమితి కాకూడదు.

పండితుల విశ్లేషణ

ముద్దుఫళని గురించి పండితులు పలు రకాలైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆమెమొదటి ఫెమినిస్ట్ స్వరంగా పరిగణించబడుతుంది.స్త్రీ కోరికలను దాచకుండా చెప్పింది. సాహిత్యంలో ఒక కొత్త దిశ ఇచ్చిందని సానుకూలంగాఅభిప్రాయపడ్డారు.

కాని కొందరుఅశ్లీలత ఎక్కువగా ఉందని, సామాజిక విలువలకు విరుద్ధమని విమర్శించారు.కానీ ఆధునిక దృష్టిలోఇదిస్త్రీ స్వేచ్ఛ యొక్క వ్యక్తీకరణగా భావిస్తారు.సాహసానికి,స్త్రీ స్వరానికి,శృంగార సాహిత్యానికి ఒక మైలురాయి ముద్దుఫళనిని ఒక ప్రతీకగా చూస్తారు.ప్రేమ అనేది కేవలం పవిత్రత కాదు. అది కోరిక, బాధ, అసూయకలిసిన జీవితం అనిముద్దుఫళని కవిత్వం మనకు చెబుతుంది. అది చెప్పడానికి ఆమె ఎంచుకున్న భాషనిజాయితీ, ధైర్యం, సాహసం.

ముద్దుఫళని గురించి పండితుల అభిప్రాయాలు చాలా విభిన్నంగా ఉన్నాయి.

ఆధునిక సానుకూల విశ్లేషణ

“మొదటి ఫెమినిస్ట్ స్వరం”ఆమె స్త్రీ కోరికలను దాచలేదు. స్త్రీకి కూడా శృంగారం మీద హక్కు ఉందని చూపించింది.కొందరు ఆమెను “తెలుగు సాహిత్యంలో తొలి స్త్రీవాద కవయిత్రి”గా పరిగణిస్తారు.

స్త్రీ మనోవైజ్ఞానికతరాధ పాత్రలోప్రేమ, అసూయ, స్వాధీనం భావం. ఇవన్నీ చాలా సహజంగా చూపించింది.సాహిత్య ధైర్యం. ఆ కాలంలోఇలాంటి విషయాలు చెప్పడం సాహసం. కానీ ఆమెఏ సంకోచం లేకుండా రాసింది.

సంప్రదాయ విమర్శలు

  1. అశ్లీలత ఆరోపణ. కొందరు పండితులు“ఇది అధిక శృంగారం” అన్నారు. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో

దీనిని నిషేధించారు.

  1. సామాజిక విలువలు. సంప్రదాయ దృష్టిలోఇది నీతికి విరుద్ధమని భావించారు.

మధ్యస్థ విశ్లేషణ

కొంతమంది పండితులు ఇలా అంటారు “ఇది అశ్లీలం కాదు. కానీ ఇది ఒక ప్రత్యేక సందర్భంలో, ప్రత్యేక వర్గం కోసం రాసిన సాహిత్యం”. రాజసభ సంస్కృతి. దేవదాసి సంప్రదాయం. ఇవి అర్థం చేసుకుంటేనే ఈ కృతి విలువ తెలుస్తుంది.

రాధికా సాంత్వనంఏమిటి?శృంగార కావ్యం మాత్రమే కాదు. స్త్రీ మనసు యొక్క లోతైన విశ్లేషణ.ముద్దుఫళని ఎవరు?ధైర్యంగా మాట్లాడిన స్త్రీ. తన భావాలను దాచని కవయిత్రి. సాహిత్యంలో ఒక కొత్త దిశ చూపిన వ్యక్తి.ముద్దుఫళని కవిత్వం మనకు ఒక ప్రశ్న వేస్తుంది. “స్త్రీ భావాలు చెప్పుకోవడం తప్పా? లేక వాటిని దాచుకోవడమే తప్పా?”

పునరుద్ధరణ&సమర్థన ధోరణి

ముద్దుఫళని గురించి మాట్లాడితే మొదట గుర్తు చేసుకోవాల్సిన పేరు బెంగుళూరు నాగరత్నమ్మ గారిది.ఆమె రాధికా సాంత్వనంను తిరిగి ప్రచురించింది. బ్రిటిష్ కాలంలో “అశ్లీలం” పేరుతో నిషేధించిన గ్రంథాన్ని రక్షించింది.“ఇది అసభ్యకృతి కాదు. ఇది కళ” అని రక్షించింది. ఆమె లేకపోతే ముద్దుఫళని పేరు మరిచిపోయే అవకాశం ఉండేది.ఆమె అభిప్రాయంలో “శృంగారం అంటే అసభ్యం కాదు. అది సాహిత్యంలో ఒక సహజమైన రసం”. పురుష కవులు రాస్తే గొప్పగా చూస్తారు, స్త్రీ రాస్తే ఎందుకు తప్పు? అని ప్రశ్నించింది.

ముద్దుఫళని తిరిగి సాహిత్య చరిత్రలో నిలబడటానికి కారణం నాగరత్నమ్మే.

స్త్రీవాద&ఆధునిక విశ్లేషణ

కందుకూరి వీరేశలింగం గారు ముద్దుఫళని కవిత్వాన్ని విమర్శించాడు. “ఇది శృంగారం ఎక్కువగా ఉంది” అని భావించాడు.అయితేఇది ఆ కాలపుసామాజిక సంస్కరణ దృష్టిప్రభావం. ఆయన కాలంలో (19వ శతాబ్దం చివర) సాహిత్యంలో నైతికతకు ప్రాముఖ్యత ఇచ్చాడు.

వ్యక్తిగత స్వేచ్ఛ, ముఖ్యంగా స్త్రీ స్వేచ్ఛకు మద్దతుదారైన చలం గారు ముద్దుఫళని ధైర్యాన్ని ప్రశంసించాడు. స్త్రీ కోరికలను నిర్భయంగా చెప్పిన రచయిత్రిగా చూశాడు.ఆయన దృష్టిలోముద్దుఫళని సాహిత్యం “నిజాయితీ గల స్త్రీ స్వరం” గా భావించాడు.

వెల్చేరు నారాయణరావు గారు రాధికా సాంత్వనంను సాహిత్య, సాంస్కృతిక కోణంలో విశ్లేషించాడు.ఇది కేవలం శృంగార కావ్యం కాదు. రాజసభ సంస్కృతి, దేవదాసి సంప్రదాయం ప్రతిబింబం. స్త్రీ అనుభవాలను లోతుగా చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు.

ఆయన దృష్టిలోఈ కృతిని అర్థం చేసుకోవాలంటే దానిసాంస్కృతిక నేపథ్యంతెలుసుకోవాలి.

భారతీయ స్త్రీ రచయితలపై పరిశోధన చేసిన సుశీ థారు (Susie Tharu) గారిఅభిప్రాయంలోముద్దుఫళని రచన “స్త్రీ శరీరం, కోరికలను తిరిగి స్వాధీనం చేసుకోవడం” అంటేస్త్రీ తన అనుభవాన్ని తనే చెప్పుకోవడం.

స్త్రీల రచనలను సమగ్రంగా పరిశీలించిన కె. లలిత,ముద్దుఫళనిపురుషాధిక్య సాహిత్యాన్ని సవాలు చేసింది. స్త్రీ కోణాన్ని ముందుకు తెచ్చిందని అభిప్రాయ పడ్డారు.

పరిశోధకుడు, తెలుగు గ్రంథాలను సేకరించి ప్రచురించే సి.పి. బ్రౌన్ సంప్రదాయం,విమర్శాత్మక దృష్టిలోముద్దుఫళని సాహిత్యంలోని శృంగార భాగాలపై అసహనం చూపినట్టు,కాలనీయ నైతిక ప్రమాణాల ప్రభావం ఉందని భావించబడుతుంది.

సంప్రదాయ పండితులు (సామాన్య దృష్టి)శృంగారాన్ని పరిమితంగా మాత్రమే అంగీకరించారు.ముద్దుఫళని రచనలో“అధిక స్పష్టత” ఉందని విమర్శించారు.వారి దృష్టిలోసాహిత్యం అంటే నీతి, సంయమనాలసమ్మేళనం.

ఇప్పటి పరిశోధకుల సమతుల్య ఆధునిక దృష్టిలోరాధికా సాంత్వనంను ఒక రాజసభ సాంస్కృతిక ఉత్పత్తి. దేవదాసి కళాసంప్రదాయం ప్రభావం. స్త్రీ అనుభవాల నిజాయితీ ప్రతిబింబం.

ముద్దుఫళని మీద పండితుల సమగ్ర విశ్లేషణ ఒక పెద్ద విషయం చెబుతాయి.ఒకే కృతిమూడు రకాల అర్థాలు కొందరికి అశ్లీలం.కొందరికి సాహసవంతమైన సాహిత్యం.మరికొందరికి సాంస్కృతిక పత్రం.

ఆధునిక పరిశోధకుల దృష్టిలో ముద్దుఫళని

ముద్దుఫళనిపై ఆధునిక పరిశోధనలో ముఖ్యమైన మలుపుసుశీ థారు, కె. లలిత సంపాదించిన Women Writing in India వంటి సంకలనాల ద్వారా వచ్చింది. అక్కడ ముద్దుఫళని రచనను భారతీయ మహిళల సాహిత్య చరిత్రలో భాగంగా చదివారు. 

అదేవిధంగా వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ సంపాదించిన Classical Telugu Poetryలో ముద్దుఫళనికి స్థానం ఇవ్వడం, ఆమెను తెలుగు శాస్త్రీయ కవితా సంప్రదాయంలో ఒక ముఖ్యమైన కవిగా చూడవచ్చని సూచిస్తుంది. ఈ సంకలనం 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు తెలుగు కవిత్వంలోని ముఖ్యమైన స్వరాలను పరిచయం చేస్తుంది. 

ఇక ఆధునిక లింగ అధ్యయనాల్లో ముద్దుఫళని రచననుదేవదాసి సంస్కరణ ఉద్యమం, స్త్రీ లైంగికత, వలస నైతికత, సాహిత్య స్వేచ్ఛవంటి అంశాలతో అనుసంధానించి పరిశీలిస్తున్నారు. పరోమితా బోస్ పరిశోధన కూడా Radhika Santwanamచుట్టూ 1911లో జరిగిన చర్చను దేవదాసి సంస్కరణ, స్త్రీ లైంగికత, వలస నైతికతల విస్తృత సందర్భంలో పరిశీలిస్తుంది. 

అయితే ఆమెను ‘ఫెమినిస్ట్’ అని పిలవడం ఎంతవరకు సరైనది?ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న.ముద్దుఫళని స్వయంగా ఆధునిక అర్థంలో స్త్రీవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు.ఆమె రచన ఒక రాజకీయ ప్రకటన కూడా కాదు.కానీ ఆమె చేసిన పని మాత్రం తరువాతి స్త్రీవాద పఠనాలకు అనుకూలంగా ఉంది.ఎందుకంటే ఆమెస్త్రీకి కోరిక ఉందని అంగీకరించింది.తన కోరికను వ్యక్తం చేయగలదని చూపించింది.అసూయ ఉంటుందని దాచలేదు. తన అనుభవాన్ని తానే చెప్పే హక్కు ఇచ్చింది.స్త్రీ తన శరీరం గురించి మాట్లాడటం సిగ్గు కాదని తన రచన ద్వారా చూపించింది.

ఈ కారణాల వల్లనే ఆధునిక పాఠకులు ముద్దుఫళనిలో ఒక శక్తివంతమైనస్త్రీ స్వరాన్నిచూస్తున్నారు.

ముద్దుఫళని ఎందుకు ముఖ్యమైనది?

ముద్దుఫళని మనకు కేవలం 18వ శతాబ్దపు ఒక కవయిత్రి గురించి చెప్పదు.ఆమె ద్వారా మనం ఒక మొత్తం ప్రపంచాన్ని చూస్తాం.తంజావూరు రాజసభను,మరాఠా పాలనలో తెలుగు సాహిత్య వికాసాన్ని,దేవదాసి కళాసంప్రదాయాన్ని,స్త్రీలకు లభించిన ప్రత్యేకమైన విద్యా, కళా అవకాశాలను, శృంగార సాహిత్య సంప్రదాయాన్ని,వలస పాలకుల నైతిక ప్రమాణాలను,19వ శతాబ్దపు సామాజిక సంస్కరణ భావజాలాన్ని,స్త్రీ రచనపై సమాజం పెట్టిన నియంత్రణలను.ముఖ్యంగాఒక స్త్రీ తన గొంతుతో మాట్లాడినప్పుడు సమాజం ఎలా స్పందిస్తుందో.

ముద్దుఫళని రెండు శతాబ్దాల తరువాత కూడా ఎందుకు మనల్ని ప్రశ్నిస్తుంది?

ముద్దుఫళని కవిత్వం మన ముందుంచే అసలు ప్రశ్న“స్త్రీ తన భావాలను తానే చెప్పుకోవచ్చా?”అది కేవలం శృంగారం గురించి ప్రశ్న కాదు.తన ప్రేమ గురించి స్త్రీ మాట్లాడవచ్చా?తన కోరిక గురించి మాట్లాడవచ్చా?తన శరీరం గురించి మాట్లాడవచ్చా?తన అసూయను అంగీకరించవచ్చా?తనకు నచ్చిన పురుషుడిని తానే కోరుకోవచ్చా?తన సాహిత్య ప్రతిభను తానే ప్రకటించుకోవచ్చా?ముద్దుఫళని ఈ ప్రశ్నలకు సిద్ధాంతపరమైన సమాధానాలు రాయలేదు.

ఆమె తన కవిత్వంతోనే సమాధానం చెప్పింది.

ముద్దుఫళనిని కేవలం“శృంగార కవయిత్రి”గా పిలవడం ఆమె సాహిత్యాన్ని చిన్నచూపు చూడటమే.ఆమె ఒక రాజసభీయ కళా ప్రపంచం నుంచి వచ్చిన కవయిత్రి.ఆమెకు ముందు తరాల కళా వారసత్వం ఉంది.ఆమెకు తెలుగు, సంస్కృత సాహిత్య, సంగీతం, నాట్య పరిజ్ఞానం ఉంది.ఆమెకు తన ప్రతిభపై నమ్మకం ఉంది.ముఖ్యంగా స్త్రీ అనుభవాన్ని స్త్రీ స్వరంతో చెప్పే ధైర్యం ఉంది.రాధికా సాంత్వనంలో రాధ కృష్ణుని నుంచి సాంత్వనం పొందుతుంది.కానీ చరిత్రలో ముద్దుఫళనికి సాంత్వనం అవసరం రాలేదు.ఆమెను ఒకప్పుడు అశ్లీలురాలిగా చూశారు.ఆమె రచనను తొలగించారు.ఆమె పద్యాలను కత్తిరించారు.తరువాత మరో కళాకారిణి బెంగళూరు నాగరత్నమ్మ ఆ తొలగించబడిన స్వరాన్ని తిరిగి తీసుకొచ్చింది.

అందుకే ముద్దుఫళని కథలో కనిపించేది కేవలంఒక కవయిత్రి కథ కాదు.ఒక స్త్రీ రాసిన మాటలను చరిత్ర ఎలా అణచివేయగలదో అదే మాటలను మరో స్త్రీ ఎలా తిరిగి చరిత్రలో నిలబెట్టగలదో చెప్పే కథ.

ముద్దుఫళని అందుకే ఈనాటికీ మనకు సంబంధించినది.ఆమె శృంగారాన్ని రాసినందుకు మాత్రమే కాదు. స్త్రీ తన అనుభూతికి తానే యజమాని అని తన కవిత్వంతో నిరూపించినందుకు.

పరిశోధనకు ఉపయోగపడే ప్రధాన ఆధారాలు

  • వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ — Classical Telugu Poetry: An Anthology, University of California Press. ఇందులో ముద్దుఫళనికి ప్రత్యేక అధ్యాయం ఉంది. 

  • సుశీ థారు, కె. లలిత — Women Writing in India. ముద్దుఫళని రచనను మహిళా సాహిత్య చరిత్రలో చర్చించిన ముఖ్య సంకలనం. 

  • పరోమితా బోస్ — “Devadasi Reform in Colonial South India: The Case of Radhika Santwanam”. ముద్దుఫళని–నాగరత్నమ్మ–వీరేశలింగం వివాదాన్ని వలసకాల సామాజిక సందర్భంలో పరిశీలిస్తుంది. 

  • బెంగళూరు నాగరత్నమ్మ 1910 పునర్ముద్రణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు. 

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి – వీరనారి జీవితం, పోరాటం

వినాయక చవితి – సామాజిక పండుగ