నీజతగానేనుండాలి

 పుస్తకసమీక్ష.

శ్రీమతిమాలాకుమార్గారికథామాల “నీజతగానేనుండాలి” సంపుటిఒకకదంబమాల.

మల్లెలు,కనకాంబరాలు, మరువంకలిపికట్టినపూలమాలలాగాఈకథామాలవైవిధ్యమైనకథలతోఅల్లినకథామాల.

శ్రీమతిమాలాకుమార్గారు (కమలపరచ) వ్రాసినఈసంపుటిలోమొత్తం 53 కథలుఉన్నాయి.

మల్లెలు,కనకాంబరం, మరువంలాగా

కొన్నిప్రేమకథలు, కొన్నిమనసునికదిలించేకథలు, కొన్నిమిలిటరీకుటుంబాలకథలు,కొన్నిడయాస్పోరాకథలుఇలాపూలదండలాగా, వేరువేరుపూలకుఉన్నపరిమళంలాగా,  మనసునిమరిపిస్తూ,మురిపిస్తూ, గుండెనిస్పృశిస్తూసాగుతాయి.

పుస్తకంపట్టుకుంటేచివరివరకుచదివిస్తుందికమలగారికథనం, కథాంశం.

టైటిల్కథనీజతగానేనుండాలిలో

చిన్నప్పటినుంచిఅనుకున్నమేనబావతో, పెళ్లిజరగకపోవడంతో, డిప్రెషన్లోకివెళ్లినగౌరికిపెళ్లిచేస్తే, పరిస్థితినయమవుతుందనిఆశతో, ప్రకాష్కిఇచ్చిచేస్తే, ముందుఆమెప్రవర్తనకిప్రకాష్కికోపంవచ్చినా, గౌరితాతగారుఅసలువిషయంచెప్తేఅర్థంచేసుకునిగౌరినినెమ్మదిగామార్చుకుందామని, ఆమెచేతేనీజతగానేనుండాలిఅనిపించాలిఅనుకోవడం.

సున్నితమైనఅంశాన్నిఇంకాసున్నితంగాకథలోచెప్పారుమాలగారు.

ఇంకోకథ ‘శాంభవి’ లోఆమెరూపంఎలాఉన్నామంచిగొంతుఉండడంతో, లాయర్విమలసాయంతో, ఆత్మవిశ్వాసంతోపాటలపోటీలోగెలవడం, పంచవటిలోపిల్లలుతల్లికోసంఅందరూఒకదగ్గరఉండాలనుకోవడం, అలానేఆత్మీయబంధం, సహచరిలాంటికథల్లోసున్నితమైనకుటుంబఅంశాలుతీసుకున్నారు.

ధీర, విధివిన్యాసాలువంటిఇంకొన్నికథల్లోమిలిటరీవారిజీవితాలగురించివ్రాసారు. రచయిత్రికమలగారిభర్తశ్రీప్రభాతకుమార్గారు, మిలిటరీలోపనిచేయడంవల్ల,అక్కడఎక్కువకాలంగడపడంవలన,  వారిజీవనంపైఅవగాహనఉన్నమాలగారు, అక్కడిసాధకబాధకాలు, అనుభవాలు,కష్టాలుఅన్నీమనకికళ్ళకికట్టినట్టుచూపించారు.

రాధామాధవీయం, రాజాకిఆయేగిబారాత్వంటిప్రేమకథలుచదివిపెదవులమీదనవ్వువిరిస్తే, అలమరాలిఫ్ట్, అయిననుపో…, అహోలక్ష్మణాలాంటికథలుచదివితే ‘అరే! మనకికూడాఇలానేఅయిందిగా!’ అనిపిస్తుంది.

డయాస్పోరాకథలు… హ్యూమన్లైబ్రరీ , హైస్కూల్స్వీట్హార్ట్వగైరాచదివితే, విదేశాల్లోఉన్నవారిగురించిచదివితేఏదేశమైనాప్రేమ, పెళ్లిఅనుబంధాలుఒకటేఅనిపిస్తుంది.

అన్నికథలుహాయిగాచదివిఆనందించచ్చు. ఎక్కడావిలన్లు, ఏడుపులుఉండవు.

కుట్రలు,కుతంత్రాలుఉండవు.

ఈకథామాలనిచదివి, కథాపరిమళాన్నిహాయిగాఆస్వాదించవచ్చు.

కొన్నికథలుమళ్లీ,మళ్లీచదివిస్తాయి. ఇంటిగ్రంథాలయంలోఉండాల్సినపుస్తకమనినాఅభిప్రాయం.

ఈపుస్తకంఅన్నిపెద్దబుక్స్టాల్స్లోనూదొరుకుతుంది.

ఖరీదు 175/- రూపాయలుమాత్రమే. లేదాఈకిందిమెయిల్ఐడికిమెయిల్చేసినాపంపుతారు.

పుస్తకంవెల, పోస్టేజ్కలిపి 20% తక్కువకిపంపుతారు.

prabhatakamalam@gmail.com

Written by Sripathi Lalitha

నా పరిచయం

నా కథలే పాఠకుల సమస్యలకి కౌన్సిలింగ్ చెయ్యాలి - ఇదే నా మోటో

నా పేరు శ్రీపతి లలితకుమారి.
నేను ఆంధ్రాబ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను.

అరవై ఏళ్లకి, ఫేస్బుక్ లో కొన్ని సాహితీ గ్రూపులలో చేరాను. అక్కడ ప్రారంభమైంది నా సాహితీ ప్రయాణం.
శ్రీపతి లలిత పేరుతో కథా రచన మొదలుపెట్టి, సుమారు తొంభై పైనే కథలు వ్రాసాను.
ఈనాడు, సహరి, రవళి, సంచిక, మన తెలుగు కథలు, గోతెలుగు, సుమతి,తపస్వి మనోహరం, వార్త, తెలుగుతల్లి కెనడా పత్రికల లోనే కాక, TAGCA వారి వాహిని ఉగాది పత్రికలోనూ, సుధామగారు నిర్వహించిన ప్రసన్నభారతి వారి ఓసారిచూడండి అంతే,
ఫేస్బుక్ గ్రూప్ లు అచ్చంగా తెలుగు, భావుక, బాపురమణీయం, పొన్నాడ వారి పున్నాగవనం లో నా కథలు వచ్చాయి. ఇరవైకి పైగా కథలకు బహుమతులు వచ్చాయి.

నేను వ్రాసిన చాలా కథలు, టోరీ రేడియో ప్రోగ్రాం లోనూ, లక్ష్మి చెప్పే కథలు, మీ కృష్ణమ్మ కథలు, మీ కథల సమయం, మనతెలుగు కథలు వంటి యూట్యూబ్ ఛానల్ లో కూడా చదివారు.

సైకాలజీ అన్నా, కౌన్సిలింగ్ అన్నా, ఎంతో ఇష్టమున్న నాకు, నేను వ్రాసే కథలే, పాఠకులకు ఒక కౌన్సిలింగ్ గా ఉండాలని ఒక సమస్యతో కథ వ్రాస్తే దానిలోనే పరిష్కారం సూచిస్తూ కథలు వ్రాయడం మొదలుపెట్టాను. అదే నా ప్రత్యేకతగా అందరూ అభిమానిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మృదుమధురమైన స్వరం

సాహిత్యమే నా ఊరట – మైథిలీ అబ్బరాజు