శ్రీ రాములోరి పెళ్లి

శ్రీరామనవమి సందర్భంగా

శ్రీరామ నవమి వేసవి తొలి రోజుల్లో వచ్చే పండుగ  . ఉగాది తొలి పండుగ అయితే రాములవారి పెళ్లి అంటే శ్రీరామనవమి మలి పండుగ  .దశావతారాలన్నింటిలో విశిష్టమైనది  .పరిపూర్ణమైంది రామావతారం  .సీతారాముల కళ్యాణం జరిపించిన , చూసిన సర్వ శుభాలు కలుగుతాయని మన పెద్దలు అంటుంటారు  .

భారతీయ సంస్కృతి సా కారమైంది రాముని వ్యక్తిత్వంతో  . రాముడు మర్యాద పురుషోత్తముడు . జగదభి రాముడు .జగదేక మోహనుడు . చైత్ర శుద్ధ నవమి విశిష్టమైన తిధి . రామ కళ్యాణము రావణ వధా నంతరం అయోధ్య ప్రవేశం చేసింది చైత్ర శుద్ధ నవమినాడే  . మర్నాడు అంటే దశమి నాడు పట్టాభిషేకం జరిగింది. సీతారామ కళ్యాణం ,అయోధ్య ప్రవేశం , రెండు రామజనం నాడే జరిగాయి . అందుకే ఈ నవమి ప్రత్యేకమైనది . పవిత్రమైనది కూడా.

ఒకనాడు దేశంలో క్షా త్ర శక్తి సంకోచించుకొని పోయింది. రావణాసురుని ఆగడాలు మితిమీరి  ఋషులు, మునులు, సామాన్య ప్రజలు అనేక అగచా ట్లకు లోనయ్యారు  .అష్టకష్టాలు పడ్డారు . అలాంటి సమయంలో రామచంద్రుడు కోదండము  చేతబట్టి రాజ్యాన్ని , రాజ్య భోగాలను , స్వీయ జనాన్ని వదిలి 14 ఏళ్లు అడవుల్లో తిరిగి రావణుని అంతమొందించాడు .

నేడు మనం చిన్నచూపు చూస్తున్న చూసిన వారితో స్నేహం చేశాడు . పడవ నడిపే గుహుడు  మొదలు కొని తపసంపన్నులైన ఋషుల ఆశీర్వాదాలతో  ,గిరి చర- వనచరులతో సహా సమాజాన్ని సంఘటిత పరిచి  ,రావణ వధ తో దేశాన్ని బాధా  ముక్తం చేశాడు .

రామనవమి నైవేద్యాలకు పంచభక్ష పరమాన్నాలు అక్కరలేదు  .వడపప్పు పానకం చాలు ఎందుకంటే ఎందుకు అవే అంటే

 రథసప్తమి నుండి ఎండలు తీక్షణమవుతూ ఉంటాయి క్రమంగా . ఆ వేడిమిని తట్టుకోవడానికి నానబెట్టిన పెసరపప్పు తినాలి . పానకం లేదా పనీయారం అంటే బెల్లం కరిగించిన నీటిలో మిరియాల పొడి, చిటికెడు ఉప్పు కలిపితే తయారయ్యే ద్రావణం  .అది చాలు  .వడపప్పు క్లుప్తంగా అంటే నానబెట్టి వడగట్టిన పెసరపప్పులో చిటికెడు ఉప్పు వేస్తే చాలు . ఇంకొంచెం రుచి కావాలంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర చాలు . తురిమిన కొబ్బరి  ,మామిడి చేరిస్తే అమోఘం . మనవాళ్ళ గొప్పదనం అక్కడే ఉంది ఏ స్థాయి వారిని నొప్పించలేదు  .నైవేద్యాలన్నీ సింపుల్వి  .ఆయా కాలాలకు అనుగుణం గా  ,ఆరోగ్యపరంగా హితమైన వాటినే ఎంచుకున్నారు . ఆహార శాస్త్రంలో పూర్వులు సాధించిన ప్రగతి  ,దూర దృష్టి ఇలాంటిప్పుడే బయటపడుతుంది .

గతంలో ఈ పండుగ అంటే 9 రోజులు  వీధుల్లో పందిళ్లు  ,హరికథలు , బుర్రకథలు  ,భజనలు  ,పురుషులు వేసే కోలాటాలు ఎంతో హడావిడి  .మా చిన్నప్పుడు పెద్దవాళ్లకు విసనకర్రలను , చెప్పులను , గొడుగులను ప్రసాదంతో పాటు పంచేవారు .కొన్ని ఊళ్ళల్లో ఊర వతల పాత అట్టముక్కలతో ఓ నగరం సెట్ ల వేసేవారు . ఓ వ్యక్తి హనుమంతుని వేషధారణలో కొరివితో దాన్ని తగలబెట్టేవాడు . అదే లంక దహనం .

 తెలుగు ప్రాంతాలను ఏలిన రెడ్డి రాజులు తొమ్మిది రోజులపాటు వసంతోత్సవాలను నిర్వహించి  ,సామాన్య ప్రజానీకానికి వేడుకలను  ,వినోదాన్ని అందించారు . అదే సమయంలో కళాకారులకు వారి ప్రతిభను ప్రదర్శించి ప్రభువుల మెప్పు పొందే అవకాశం. చాలామంది రామనవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మరుసటి రామనవమికి  కి పూర్తి చేసేవారు .

మరో విశేషం

 దక్షిణ అమెరికా మధ్య భాగంలో నివసించే రెడ్ ఇండియన్ అనే ఆదివాసులు నేటికీ ప్రతి సంవత్సరం సీతారాముల ఉత్సవ ఘనంగా జరుపుకుంటారని ఈ సందర్భంగా సీతారాముల జీవిత ఘట్టాలను నాటకాలుగా ప్రదర్శిస్తారని 1931లో ప్రచురించబడిన హిందువుల పండుగలు అనే పుస్తకంలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు రాశారు  (  పేజీ 34 -35)

 ఇంకో ముఖ్య విషయం

సీతారాములు ఆదర్శ దంపతులు . అపురూప దంపతులు  .వారిని విడదీయాలనుకున్న వారే నాశన మయ్యారు ఎన్ని కష్టాలు వచ్చినా వారి మధ్య ఉండే ఆ ప్రేమ  ,అభిమానం మరింత గాఢంగా రూపుదిద్దుకున్నది .శూ ర్పణఖ  సీతను దూరం పెట్టి , రాముని పొందాలనుకుని అవమానాల పాలయింది , అలాగే రావణుడు రాముని నుండి సీతను విడదీసి , పొందాలనుకుని బంధుమిత్ర సపరివార సమేతంగా సర్వనాశనమయ్యాడు .

 సీతారాములు ఇద్దరు కాదు ఒక్కరే . రాముని జన్మకు కారణం రావణ వధ తద్వారా లోక కళ్యాణం సీతతో కూడిన రాముని వల్లనే లోక కళ్యాణం సాధించబడింది  .

సీతా రాముల కళ్యాణం చూ తము  రారండి .

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కవనశిల్పులు

శ్రీరామనవమి శుభాకాంక్షలు