చివరి క్షణం

కవిత

మనిషి సంఘజీవి
కానీ ఆ సంఘమో ఎండమావి
ఎక్కడికి పోతాడో ఆ తుంటరి
ఒక్కసారిగా అయిపోతాడు ఒంటరి
ఆ ఏకాంతం ఎంత క్షోభ..!?
ఏమైపోతుందో అప్పటిదాకా అనుభవించిన శోభ..
చచ్చీచెడి సంపాదించిన యశస్సు
వడివడిగా వచ్చి మింగేస్తుంది ఆ తమస్సు
నిన్నేగా మొదలైంది ఉషస్సు
అనుకునేలోగానే అయిపోతుంది ఆయుష్షు
కోరి పెంచుకున్న కుటుంబం
చూస్తుండగానే అస్తమించే రవిబింబం
దారి తప్పిన ధర్మాలు, అరాకొర క్రూర కర్మాలు
ఒంటిపైకెక్కి ఒడిస్సీ చేస్తుంటే
కనురెప్పలు బరువు, కన్నీటికి కరువు
పెదవులు కదపలేని పేదరికం
గొంతు దాటి, గుండెను చేరి
నిస్సహాయతతో కునారిల్లి కుంటిదై
కుమిలిపోతున్న ఆ క్షణాన
కర్కశంగా లాగే కబంధహస్తం
విలవిల్లాడుతూనే వీడ్కోలు తీసుకునే మస్తకం
రేపటి తరానికి పఠించవలసిన విలువైన పుస్తకం
అలా అప్రయత్నంగా ఆక్రమించే మృత్యువు
ఎన్నటికీ, ఎవ్వరికి అంతుపట్టని క్రతువు

Written by Uday Prasad

పేరు: ఉదయ ప్రసాద్
విద్యార్హత: ఎంఏ ( ఇంగ్లీష్ లిటరేచర్ )& బీ కాం, బిఎల్
వృత్తి: అధ్యాపకరంగంలో ప్రైవేటు సంస్థలలో 30 సంవత్సరాలు పని చేసిన అనుభవం
ప్రవృత్తి : తీరిక సమయంలో: మొక్కలు పెంచడం, కథలు, కవితలు వ్రాయటం
తొలి రచన. : తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు తొలి కథ ప్రచురితమైంది. ప్రస్తుతం ప్రతిలిపి ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో రాస్తున్నాను.
తెలిసిన భాషలు: తెలుగు, ఇంగ్లీష్, హిందీ
అడ్రస్. : కే .ఎస్ ఆర్ కాలనీ, రాగన్నగూడ, హైదరాబాద్.
ఫోన్ నెంబర్: 8008402588

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దీపం పరంజ్యోతి

జాగృతం