చాయ గిన్నె కష్టాలు

ప్రతీ రోజూ నరకమే నాకు..పొద్దు లేదు మాపు లేదు…దుక్కమొస్తుంది…

ఎందో పడి పోయినట్టు గా ఇంటామే 5 గొట్టంగ లేస్తది…లేసుడు తోనే పండ్లు తోమి వంటింట్ల కొచ్చి నా కోసం ఎతుకుతది…. ముద్దుగ కోపెడు చిక్కగ చాయ వెట్కొనీ కుర్షి ల గుసోని బుర్ర బుర్ర తాగుతది….

ఇగ తానాని కి వొయ్యి వచ్చే వరకు వాళ్ళాయన లేషి పేపరు సదువు కుంట ” ఇగో గింత శాయ వెట్టు” అంటడు.

” ఆ ! గట్లే పెడ్తున్న..అని మల్ల నన్ను పీసు వెట్టి తోమి చాయ్ వెట్టి.. కోపేడు ఆయనకు..మిగిలింది మల్ల తాగుతది గుట్ట గుట్ట….

ఇగ గా పోరగాండ్లు లేశీ…” అమ్మా ! చాయ్ వెట్టినవా ” అంటరు…

” పెడ్తున్న ” అని మల్ల తోముతది నన్ను….

” అమ్మయ్య ! ఇగ రెస్ట్ దీసుకుంట అని అనుకునే వరకు…

” అమ్మ గారు! గింత శా వట్టు వొయ్య రాదు నెత్తి బాగ నొ స్తంది” అనే…పని మనిషి..

నీ పాడు గాను నన్ను బత్క నియ్యరా ఉల్లో!

మల్ల నన్ను పొయ్యి మీద వెట్టుడే…

ఇగ ఇంట్ల అందరు ఏటోల్లు అటు వోయింరు…. గూట్లే వోయ్యి పంట..

” ట్రింగ్..ట్రింగ్…”

ఎవలో ఫోన్ జేశిరి…

ఇంటామె” అలో! ఎవలు….కిందింటి పంకజమా! వొస్తావు..దా! గట్ల అడుగుడు ఎందుకు! రావాలే బాజాప్తగ…చాయ వెట్కోని తాగుదాము”..

వామ్మో! నన్ను చంపుతావే! నీ చాయ్ పాడు గాను..

రానే వచ్చే గామే! ముద్దుగ సోపాల గుసొని ఇక ఇకలు..పక పకలు…ఎల్లి మీద బల్లి వడే..బల్లి మీద ఎల్లి వడే అని…నన్ను గుంజుకొచ్చి పొయ్యి మీద వెట్టి చాయ్ వెట్కోనీ తాగిరి…

గిట్ల నన్ను తోమి తోమి సంపుతున్నరు…బ్రమ్మ తానికి వొయిన కష్టం జెప్పుకో నీకి…

అయ్యా! అనంగనే….

ఎవరక్కడ ఇగో చాయ గిన్నె వొచ్చింది..నాలుగు తలకాయలు నొస్తున్నయి…పెద్ద కోపెడు చాయ వేట్టుం డి అన్నడు….ఇగ ఎవలకూ జెప్పాలే…
సంతోష మొచ్చినా దుక్క మొచ్ఛినా చాయ నే నట..పొర గాండ్లకు పరిచ్చలు వొస్తే నిద్ర రాకుం ట చాయ నే…

గీతలు వడ్డయి పెయ్యంత…పొయ్యి మీద పెట్టి పెట్టీ.. ముడ్డి మండుతుంది….
జెర్ర న్యాయం జెప్పుర్రి !

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సజీవం, దృశ్యాత్మకం, భావాత్మకం`శీలా సుభద్రాదేవి కవిత్వం..

ధనుర్మాస విశిష్టత – మార్గళి – తిరుప్పావై – 1 వ భాగం